''నివార్'' వచ్చేస్తోంది.. తమిళనాడు, పుదుచ్చేరికి సైక్లోన్ అలెర్ట్.. చెన్నైకి మళ్లీ...?

Webdunia
సోమవారం, 23 నవంబరు 2020 (09:44 IST)
తమిళనాడు మరో తుఫాను ప్రమాదం ముంచుకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారనుంది. ఈ అల్పపీడనం రెండు రోజుల్లో తుఫానుగా మారబోతోంది. దీనివల్ల తమిళనాడుకు నవంబర్ 25 నుంచి అతి భారీ వర్ష సూచన ఉంది. ఈ తుఫానుకు ''నివార్'' అని పేరు పెట్టారు. ఇది ప్రస్తుతం ఉత్తర తమిళనాడు తీరం వైపు కదులుతోంది. 
 
తుఫానును దృష్టిలో పెట్టుకొని... తమిళనాడు, పుదుచ్చేరికి సైక్లోన్ అలర్ట్ జారీ చేశారు. నవంబర్ 22 నుంచి జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ప్రధానంగా నవంబర్ 22 నుంచి 25 వరకూ తుఫాను వల్ల సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది కాబట్టి... ఎట్టి పరిస్థితుల్లో బంగాళాఖాతంలోకి వెళ్లొద్దని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో జాలర్లు కూడా చేపల వేటకు వెళ్లొద్దని చెప్పారు.
 
అల్పపీడనం 24 గంటల్లో వాయుగుండంగా మారుతుందనీ... ఆ తర్వాత మరో 24 గంటల్లో తుఫానుగా అవుతుందని వాతావరణ అధికారులు తెలిపారు. ఇది తమిళనాడులోని కారైకల్, మహాబలిపురం దగ్గర నవంబర్ 25న మధ్యాహ్నం వేళ తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నట్లు వాతావరణ అధికారులు తెలిపారు. నవంబర్ 25 నుంచి తమిళనాడులోని చాలా చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు. ఇంకా చెన్నై నగర ప్రజలు ఈ సైక్లోన్ కారణంగా అప్రమత్తంగా వుండాలని అధికారులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishnu : శ్రీ విష్ణు, నయన సారిక జంటగా విష్ణు విన్యాసం రాబోతుంది

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ జంట గా చిత్రం ప్రారంభం

Jin: భూతనాల చెరువు నేపథ్యంగా జిన్ మూవీ సిద్దమైంది

నటిపై లైంగిక దాడి కేసు - నిర్దోషిగా మంజు వారియర్ మాజీ భర్త... న్యాయం జరగలేదు...

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ కాంబినేషన్ లో చిత్రం లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

ఉసిరి, నిమ్మకాయతో ఉప్పు.. గుండె ఆరోగ్యంతో పాటు రక్తపోటుకు చెక్

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

తర్వాతి కథనం
Show comments