Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై టెక్కీ అత్యాచారం.. హత్య కేసులో ముద్దాయిలకు జీవితఖైదు!

Webdunia
శుక్రవారం, 28 నవంబరు 2014 (19:45 IST)
చెన్నైకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మహేశ్వరిని అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన కేసులో ముద్దాయిలుగా తేలిన ముగ్గురికి చెంగల్పట్టు మహిళా కోర్టు యావజ్జీవ కారాగారశిక్ష విధించింది. 
 
శుక్రవారం వెలువడిన ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే.. చెన్నై శివార్లలోని సిప్కాట్ ఐటీపార్కులోని టీసీఎస్‌లో పనిచేస్తున్న ఉమామహేశ్వరిపై గత ఫిబ్రవరి 13వ తేదీన రామ్ మండల్, ఉత్తమ్ మండల్, ఉజ్జల్ మండల్ అనే బీహారీ వలస కూలీలు అత్యాచారం చేశారు. అనంతరం, హత్య చేశారు. దీనిపై విచారణ చేసిన సీబీసీఐడీ అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 
 
ఆమె డెబిట్ కార్డుతో డబ్బు డ్రా చేసిన ఓ వ్యక్తిని కనిపెట్టి, వారి కాల్ డేటా పరిశీలించి రామ్, ఉత్తమ్‌ను విచారించారు. వారు నేరం అంగీకరించడంతో కోల్‌కతా పారిపోయిన ఉజ్జల్ మండల్‌ను వెతికిపట్టుకున్నారు. అనంతరం 51 మంది సాక్షులను, 119 ఎగ్జిబిట్లను, 61 వస్తువులను పరిశీలించిన అనంతరం న్యాయస్థానం వారిని దోషులుగా నిర్ధారించి, జీవిత ఖైదు విధించింది. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments