Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నరుగా తమిళిసై సౌందర్ రాజన్

Webdunia
గురువారం, 18 ఫిబ్రవరి 2021 (11:42 IST)
రాష్ట్ర హోదా కలిగిన కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి కొత్త లెఫ్టినెంట్ గవర్నరుగా తెలంగాణ రాష్ట్ర గవర్నరు తమిళిసై సౌందర్ రాజన్‌ను కేంద్రం నియమించింది. దీంతో ఆమె గురువారం బాధ్యతలు స్వీకరించారు. 
 
ప్రస్తుతం తెలంగాణ గవర్నర్‌గా ఉన్న ఆమె పుదుచ్చేరి ఎల్జీగా అదనపు బాధ్యతలు స్వీకరించారు. అక్కడి రాజ్‌భవన్‌లో తమిళిసై చేత మద్రాస్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయించారు. 
 
ఈ కార్యక్రమంలో ఆ ప్రాంత ముఖ్యమంత్రి నారాయణస్వామి పాల్గొన్నారు. ఎల్జీగా బాధ్యతలు చేపట్టడానికి నిన్న రాత్రి పుదుచ్చేరి చేరుకున్న తెలంగాణ గవర్నర్‌ తమిళిసైకి సీఎం నారాయణస్వామి స్వాగతం పలికారు. 
 
పుదుచ్చేరిలో నెలరోజుల వ్యవధిలో అధికార కాంగ్రెస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో అక్కడి ప్రభుత్వం సంక్షోభంలో పడింది. దీంతో అక్కడి రాజకీయాలు అనూహ్య మలుపులు తిరిగాయి. ఈ క్రమంలో పుదుచ్చేరికి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ఉన్న కిరణ్‌బేదీని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈ నెల 16న తొలగించిన విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments