Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మ మరణం చేదు నిజం.. జీర్ణించుకోలేక 77 మంది కన్నుమూత.. ఆ రోజు అమ్మ క్యాంటీన్లు మాత్రం..?

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గుండెపోటుతో డిసెంబర్ 5వ తేదీన తుదిశ్వాస విడిచారు. దీంతో తమిళ రాష్ట్రమంతా విషాదంలో మునిగిపోయింది. అమ్మ తమను అనాథలను చేసి వెళ్లిపోయిందంటూ ప్రజలు దీనంగా రోదించారు. ఈ చేదు నిజా

Webdunia
గురువారం, 8 డిశెంబరు 2016 (15:26 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గుండెపోటుతో డిసెంబర్ 5వ తేదీన తుదిశ్వాస విడిచారు. దీంతో తమిళ రాష్ట్రమంతా విషాదంలో మునిగిపోయింది. అమ్మ తమను అనాథలను చేసి వెళ్లిపోయిందంటూ ప్రజలు దీనంగా రోదించారు. ఈ చేదు నిజాన్ని జీర్ణించుకోలేక 77 మంది మరణించారు. జయలలిత చనిపోయిందని తెలియగానే తమిళనాడులోని దుకాణాలు, హోటళ్లు, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారు. 
 
విద్యాసంస్థలకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. కానీ ఒక్కచోట మాత్రం తలుపులు తెరిచే ఉంచారు. తమ సేవలను కొనసాగించారు. అవే అమ్మ క్యాంటీన్లు. పేద ప్రజల ఆకలిని తీర్చేందుకు 5రూపాయలకే భోజనం పెట్టే కార్యక్రమానికి జయలలిత శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.
 
జయలలిత చనిపోయిందన్న వార్త తెలియగానే అమ్మ క్యాంటీన్లను కూడా మూసేద్దామనుకున్నామని, కానీ ఆమె సంకల్పానికి తూట్లు పొడవడం ఇష్టం లేక ఆ తర్వాత కూడా క్యాంటీన్లను కొనసాగించామని నిర్వాహకులు తెలిపారు. అమ్మ ప్రతిక్షణం ప్రజల కోసం పరితపించేవారని, ఇలా ప్రజల ఆకలి తీరిస్తేనే ఆమె ఆత్మ శాంతిస్తుందనే ఉద్దేశంతోనే తమ సేవలు కొనసాగించినట్లు తెలిపారు. ఏదేమైనా వీరి ఉద్దేశం బాగుందని పలువురు అభినందిస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments