Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై టెక్కీ స్వాతి దారుణ హత్య... వారం క్రితం కూడా వాదన పెట్టుకున్నాడు...

వాడేం చేస్తాడులే అని అనుకోవడమే ఆమె చేసిన తప్పు. ఆమె అతడి వార్నింగులను లైట్ గా తీసుకోవడం వల్ల ప్రాణాలను కబళించాడు ఆ దుండగుడు. చెన్నై నుంగబాక్కం రైల్వే స్టేషనులో పట్టపగలు అందరూ చూస్తుండగా నల్ల ప్యాంటు ధ

Webdunia
శుక్రవారం, 24 జూన్ 2016 (16:20 IST)
వాడేం చేస్తాడులే అని అనుకోవడమే ఆమె చేసిన తప్పు. ఆమె అతడి వార్నింగులను లైట్ గా తీసుకోవడం వల్ల ప్రాణాలను కబళించాడు ఆ దుండగుడు. చెన్నై నుంగబాక్కం రైల్వే స్టేషనులో పట్టపగలు అందరూ చూస్తుండగా నల్ల ప్యాంటు ధరించిన ఓ దుండగుడు చెన్నై ఇన్పోసిస్ లో పనిచేస్తున్న స్వాతి అనే 24 ఏళ్ల యువతిని పీక కోసి అత్యంత కిరాతకంగా హతమార్చాడు. 
 
క్రిక్కిరిసిన రైల్వే స్టేషనులో దుండగుడు ఆమెపై కత్తితో దాడి చేస్తున్నా అంతా అలా చూస్తూ ఉండిపోయారు. తేరుకునేసరికి దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు. కాగా ఇదే వ్యక్తి స్వాతితో గత వారం తీవ్రంగా వాదనకు దిగడాన్ని తను చూసినట్లు ఓ క్యాబ్ డ్రైవర్ వెల్లడించాడు. అతడు చెప్పినదాన్ని బట్టి అతడు స్వాతికి తెలిసినవాడై ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. స్వాతి బంధువులను, ఇతర స్నేహితులను విచారిస్తున్నారు.
 
కాగా తమ ఉద్యోగి దారుణ హత్యపై ఇన్ఫోసిస్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసింది. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపింది. దర్యాప్తుకు తాము పూర్తిగా సహకరిస్తామనీ, దుండగుడిని కఠినంగా శిక్షించాలని తెలిపింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments