Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరంబలూరు మాంత్రికుడి ఇంట్లో వందల సంఖ్యలో పుర్రెలు.. ఆ శవం శ్మశానం నుంచి తవ్వి తీశారు..

పెరంబలూరు మాంత్రికుడి కేసులో మరిన్ని నిజాలు బయటికి వచ్చాయి. మహిళ శవాన్ని ఇంట్లో దాచిపెట్టుకుని మంత్రాలతో క్షుద్రపూజలకు పాల్పడిన కార్తికేయన్ అనే మాంత్రికుడ్ని గత శనివారం పోలీసులు అరెస్టు చేసిన సంగతి తె

Webdunia
సోమవారం, 13 మార్చి 2017 (11:37 IST)
పెరంబలూరు మాంత్రికుడి కేసులో మరిన్ని నిజాలు బయటికి వచ్చాయి. మహిళ శవాన్ని ఇంట్లో దాచిపెట్టుకుని మంత్రాలతో క్షుద్రపూజలకు పాల్పడిన కార్తికేయన్ అనే మాంత్రికుడ్ని గత శనివారం పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అతనితో పాటు అతని భార్య నసీమా భాను (21)ను కూడా పోలీసులు అరెస్టు చేశారు.
 
ఈ కేసులో పోలీసులు ఓ మహిళ శవాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ శవాన్ని చెన్నై నడిబొడ్డున ఉన్న శ్మశాన వాటిక నుంచి తవ్వి తీసుకెళ్లినట్లు పోలీసులు కనిపెట్టారు. చెన్నై నగరానికి చెందిన ఓ బ్రోకర్‌ నుంచి రూ.20 వేలకు శవాన్ని కొనుగోలు చేసినట్లు కార్తికేయన్ చెప్పాడు. ఇందులో భాగంగా మైలాపూర్ శ్మశానంలో తవ్వకపు పనులు చేస్తున్న ధనరాజ్, సతీష్‌, కార్తీక్‌ అనే ముగ్గురిని అరెస్టు చేశారు. శవాన్ని అమ్మిన బ్రోకర్‌ వినోద్‌కుమార్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. 
 
ఈ క్రమంలో పెరంబలూరు మాంత్రికుడికి విక్రయించిన శవం చెన్నై తేనాంపేటకు చెందిన అభిరామి (20) అనే యువతిదిగా తెలిసింది. గత జనవరి 18న ఆమె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోగా, అభిరామి మృతదేహానికి పోలీసులు పోస్టుమార్టం జరిపిన తర్వాత బంధువులు శవాన్ని మైలాపూరు శ్మశానంలో ఖననం చేశారు. ఇంకా పెరంబలూరు మాంత్రికుడి ఇంట్లో వందల సంఖ్యలో పుర్రెలు కూడా లభించడంతో అవి ఏయే శ్మశానాల నుంచి తరలించారనే దానిపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments