Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమోన్మాదం యువతి.. తండ్రి బలవన్మరణం.. తల్లి క్యాన్సర్ పేషెంట్..!

Webdunia
శనివారం, 15 అక్టోబరు 2022 (12:18 IST)
ప్రేమ ఉన్మాదంగా మారిపోయింది. యువతి హత్యకు దారితీసింది. అంతటితో ఆగలేదు. కుమార్తె మరణం తట్టుకోలేక ఆ తండ్రి కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇవి చాలదన్నట్లు ఇప్పటికే క్యాన్సర్‌తో పోరాడుతున్న యువతి తల్లి.. చక్కని కుటుంబంలో చోటుచేసుకున్న ఈ విషాధాలతో నిస్సహాయురాలిగా రోదిస్తోంది. క్షణికావేశంలో ఓ ప్రేమోన్మాది చేసిన పాడుపనికి యువతి కుటుంబం కోలుకోలేని స్థితికి చేరుకుంది.

వివరాల్లోకి వెళితే.. తమిళనాడులో గురువారం సత్య అనే యువతిని ప్రేమోన్మాది సతీష్ రైలు కిందకు తోసేసి చంపేశాడు. చెన్నై ఆదంబాక్కం రాజా వీధి పోలీస్ క్వార్టర్స్‌కు చెందిన మాణిక్యం, రామ లక్ష్మి దంపతులు. రామలక్ష్మి ఆదంబాక్కం పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. వీరి కుమార్తె సత్య (20) చెన్నై టీనగర్‌లో కాలేజీ సెకండియర్ చదువుతోంది.

ఈమెను అదే ప్రాంతానికి చెందిన విశ్రాంత ఎస్సై దయాళన్ కుమారుడు సతీష్ ప్రేమించాడు. అయితే అతడి ప్రేమను ఆమె అంగీకరించలేదు. దీంతో వేధించడం మొదలెట్టాడు. దీంతో గురువారం సత్య కాలేజీ కోసం రైల్వే స్టేషన్‌లో నిలుచుని వుండగా అక్కడకి వచ్చిన సతీష్ రైలు కిందకు తోసేశాడు.

దీంతో యువతి ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడిని పోలీసులు శుక్రవారం సైదాపేట కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఈ నెల 28వ తేదీ వరకు రిమాండ్ విధించింది.

మరోవైపు కుమార్తె మరణాన్ని జీర్ణించుకోలేక పోయిన ఆమె తండ్రి శుక్రవారం ఉదయం మద్యంలో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక తల్లి రామలక్ష్మి క్యాన్సర్ బాధితురాలు. తండ్రి, కుమార్తెల మృతదేహాలను చూసి ఆమె రోదించడం స్థానికులను కలచివేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments