Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై వరదలు: కరెంటు లేదు.. తల్లి శవం పక్కనే 20 గంటల పాటు జాగారం

Webdunia
గురువారం, 3 డిశెంబరు 2015 (16:17 IST)
తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో వరదలు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. తినడానికి తిండి.. తాగడానికి నీరు లేకుండా ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఒకవైపు అనారోగ్యం పాలైతే ఆస్పత్రికి తీసుకెళ్లలేని పరిస్థితి ఏర్పడితే మరోవైపు.. చనిపోయిన వారికి అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా వీలు కాని పరిస్థితి ఆవేదనకు గురిచేస్తోంది.
 
చెన్నై నగరంలోని అశోక్ నగర్‌లో ఓ మహిళ తన తల్లి శవం పక్కన కూర్చొని 20 గంటలుగా జాగారం చేస్తోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తన తల్లి డయాలిసిస్ పేషంట్ అని... బుధవారమే ఆమె ప్రాణాలు కోల్పోయింది. కరెంట్ లేకపోవడంతో ఆమె భౌతికకాయం చీకటిలోనే ఉందని తెలిపింది. అంతేకాదు అమె తల్లి భౌతికకాయం పాడైపోయే స్థితిలో ఉంది. 
 
ఎవరైనా తనకు సహాయం చేయాలని, శ్మశానానికి తరలించేందుకు వాహనం పంపించాలని ఆమె వేడుకుంటోంది. శ్మశానాలు సైతం నీట మునిగిపోవడంతో ఆ మహిళకు అంత్యక్రియలు జరపడం కష్టంగా మారింది. ఇలాంటి ఆవేదనకు గురిచేసే ఘటనలెన్నో చెన్నైలో చోటుచేసుకుంటున్నాయి. వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varalakshmi: కొంత ఇస్తే అది మళ్ళీ ఫుల్ సర్కిల్ లా వెనక్కి వస్తుంది: వరలక్ష్మీ, నికోలయ్‌ సచ్‌దేవ్‌

Tuk Tuk: సూపర్‌ నేచురల్‌, మ్యాజికల్‌ పవర్‌ ఎలిమెంట్స్‌ సినిమా టుక్‌ టుక్‌

కథ, కథనాల మీదే నడిచే సినిమా రా రాజా చూసి సక్సెస్ చేయాలి: దర్శకుడు బి. శివ ప్రసాద్

నేను చెప్పింది కాకపోతే ఇకపై జడ్జిమెంట్ ఇవ్వను : రాజేంద్రప్రసాద్

Chitra Purushotham: ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్‌కు ఫోజులిచ్చి ఆన్‌లైన్‌‌లో వైరల్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

Show comments