Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిగరెట్ ముట్టుకోవద్దన్న భార్య.. టాయ్‌లెట్‌లోని యాసిడ్ తాగేసిన భర్త

Webdunia
శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (10:27 IST)
భారత్‌లో లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కరోనా కేసుల పెరగడం, కరోనా మహమ్మారితో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో కేంద్రం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో జనాలు ఇంటికే పరిమితమవుతున్నారు. తాజాగా ఇలా ఇంటికే పరిమితమై.. భార్యతో భర్తకు ఏర్పడిన గొడవ ఓ వ్యక్తి ప్రాణం తీసింది. 
 
సిగరెట్‌ వ్యసనాన్ని మానుకోవాలంటూ భార్య మందలిండంతో యాసిడ్‌ తాగి భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ వ్యవహారం తమిళనాడు రాజధాని చెన్నై, సాలిగ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సాలిగ్రామం, మదియళగన్‌కు చెందిన నరసింహన్‌ (72) ప్రభుత్వ బస్‌ డ్రైవర్‌గా పదవీ విరమణ పొందారు. కొన్నేళ్లుగా నరసింహన్‌కు ధూమపాన వ్యసనం ఉంది. 
 
ఈ విషయమై భార్యాభర్తలిద్దరి మధ్య గొడవలు జరిగేవి. దీనిపై దంపతులిద్దరి మధ్య మళ్లీ వివాదం రేపింది. దీంతో మనస్తాపానికి గురైన నరసింహన్ టాయ్‌లెట్‌లోని యాసిడ్‌ తాగి స్పృహ తప్పి పడిపోయాడు. ఆపై ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments