Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిగరెట్ ముట్టుకోవద్దన్న భార్య.. టాయ్‌లెట్‌లోని యాసిడ్ తాగేసిన భర్త

Webdunia
శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (10:27 IST)
భారత్‌లో లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కరోనా కేసుల పెరగడం, కరోనా మహమ్మారితో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో కేంద్రం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో జనాలు ఇంటికే పరిమితమవుతున్నారు. తాజాగా ఇలా ఇంటికే పరిమితమై.. భార్యతో భర్తకు ఏర్పడిన గొడవ ఓ వ్యక్తి ప్రాణం తీసింది. 
 
సిగరెట్‌ వ్యసనాన్ని మానుకోవాలంటూ భార్య మందలిండంతో యాసిడ్‌ తాగి భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ వ్యవహారం తమిళనాడు రాజధాని చెన్నై, సాలిగ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సాలిగ్రామం, మదియళగన్‌కు చెందిన నరసింహన్‌ (72) ప్రభుత్వ బస్‌ డ్రైవర్‌గా పదవీ విరమణ పొందారు. కొన్నేళ్లుగా నరసింహన్‌కు ధూమపాన వ్యసనం ఉంది. 
 
ఈ విషయమై భార్యాభర్తలిద్దరి మధ్య గొడవలు జరిగేవి. దీనిపై దంపతులిద్దరి మధ్య మళ్లీ వివాదం రేపింది. దీంతో మనస్తాపానికి గురైన నరసింహన్ టాయ్‌లెట్‌లోని యాసిడ్‌ తాగి స్పృహ తప్పి పడిపోయాడు. ఆపై ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments