Webdunia - Bharat's app for daily news and videos

Install App

చీకట్లో బిక్కుబిక్కుమంటోన్న చెన్నై పట్టణం.. అమ్మ క్యాంటీన్లలో ఉచిత భోజనవసతి

చెన్నై పట్టణం చీకట్లో బిక్కుబిక్కుమంటోంది. చెన్నై నగరంలోని అనేక చోట్ల సోమవారం ఉదయం నుంచే విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో అంధకారం నెలకొంది. తీవ్ర తుపాను ధాటికి భారీ వృక్షాలు విరిగిపడగా.. విద్యుత్ స్తంభాలు

Webdunia
మంగళవారం, 13 డిశెంబరు 2016 (09:16 IST)
చెన్నై పట్టణం చీకట్లో బిక్కుబిక్కుమంటోంది. చెన్నై నగరంలోని అనేక చోట్ల సోమవారం ఉదయం నుంచే విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో అంధకారం నెలకొంది. తీవ్ర తుపాను ధాటికి భారీ వృక్షాలు విరిగిపడగా.. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. తుపాను తీరం దాటినప్పటికీ దాని ప్రభావం అధికంగా ఉంది. గంటకు 140 కి.మీ. వేగంతో వీచిన పెను గాలులకు నగరం చిగురుటాకులా వణికిపోయింది.
 
ఎనిమిది వేల మందికి పైగా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారికి అమ్మ క్యాంటీన్లలో ఉచిత భోజనవసతి కల్పించారు. చెన్నై విమానాశ్రయాన్ని మూసివేయగా.. ఈ నగరానికి వెళ్ళే అన్ని బస్సు, రైలు సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేశారు.
 
మరోవైపు వార్దా తుఫాను ప్రభావంతో ఏపీలోని నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, కడప, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. చిత్తూరు జిల్లాలో ఇద్దరు మరణించారు. ఈ జిల్లాలో మంగళవారం స్కూళ్ళను మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments