Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏసీ ఆన్ చేసి కారులోనే విశ్రాంతి.. నవ వధువుతో పాటు తల్లిదండ్రులు నిప్పుకు బలి.. ఎలా?

తమిళనాడులోని మహాబలిపురం సమీపంలోని ఈసీఆర్ రోడ్డులో ఘోరం జరిగింది. రోడ్డు పక్కనే నిల్చున్న కారు నిప్పుకు ఆహుతి అయ్యింది. ఈ నిప్పులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవదహనం అయ్యారు. వీరిలో నవ వధువు కూడా

Webdunia
సోమవారం, 29 మే 2017 (13:25 IST)
తమిళనాడులోని మహాబలిపురం సమీపంలోని ఈసీఆర్ రోడ్డులో ఘోరం జరిగింది. రోడ్డు పక్కనే నిల్చున్న కారు నిప్పుకు ఆహుతి అయ్యింది. ఈ నిప్పులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవదహనం అయ్యారు. వీరిలో నవ వధువు కూడా ఉండటం అనుమానాలకు తావిస్తోంది. 
 
వివరాల్లోకి వెళితే.. చెన్నైలోని చిట్లపాక్కంకు చెందిన ఆడిటర్ జయదేవన్ (45), ఆయన భార్య రమాదేవి, వీరి కుమార్తె దివ్యశ్రీలు సజీవదహనం అయ్యారని పోలీసులు వెల్లడించారు. జయదేవన్ సతీమణి రమాదేవి టీచర్‌గా పని చేస్తుండగా, దివ్యశ్రీకి ఇటీవలే వివాహం జరిగింది. దివ్యశ్రీ భర్త విదేశాలకు వెళ్లడంతో ఆమె తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. మహాబలిపురం సమీపంలోని ఓ స్థలం చూసేందుకు జయదేవన్ తన భార్య రమాదేవి, కుమార్తె దివ్యశ్రీతో కలిసి వెళ్లారు.
 
ఎండలు మండిపోతుండటంతో స్థలం చూసిన తర్వాత ముగ్గురు కారులోనే విశ్రాంతి తీసుకుంటున్నారని.. ఆ సమయంలో మంటలు వ్యాపించినట్లు పోలీసులు చెప్పారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నెంబర్ ప్లేట్ ఆధారంగా మృతులను గుర్తించారు. 
 
ఏసీ మిషన్ పేలి మంటలు వ్యాపించడంతోనే జయదేవన్ ఫ్యామిలీ నిప్పుకు ఆహుతి అయినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అయితే నవ వధువు మృతి చెందడం.. నిద్రిస్తున్న కారులో మంటలు వ్యాపించడం వెనుక వేరేదైనా కారణాలున్నాయా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

ఆ హీరోతో రశ్మిక మందన్నా డేటింగ్ లో వున్నమాట నిజమేన !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

మండుతున్న అగ్నిగోళం నుంచి చందమామ చల్లగా ఎలా మారాడు? 4.5 బిలియన్ ఏళ్ల క్రితం (video)

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments