Webdunia - Bharat's app for daily news and videos

Install App

45 రోజులు సహజీవనం చేశాడు.. రైలులో వదిలిపెట్టి వెళ్లిపోయాడు!

Webdunia
సోమవారం, 28 జులై 2014 (14:59 IST)
పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు. 45 రోజుల పాటు హ్యాపీగా గడిపాడు. అంతే మళ్లీ జెండా ఎత్తేశాడు. కేరళ ఉడిపి జిల్లాలో ఒసాకోట్టై గ్రామానికి చెందిన అన్నప్ప పూజారి కుమారుడు రాజేంద్ర కూడా పూజారి (25) కేటరింగ్ పూర్తిచేసి ముంబైలోని ఓ స్టార్ హోటల్‌లో పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో రాజేంద్ర రెండేళ్ల క్రితం సెలవులంటూ సొంత గ్రామానికి వచ్చాడు. ఆ గ్రామంలోని సీత (20) అనే అమ్మాయిని మాయమాటలతో ప్రేమలో పడేశాడు.
 
సెల్‌ఫోన్ పరిచయం ద్వారా వీరిద్దరి పరిచయం ప్రేమగా మారింది. ఇదే అదనుగా తీసుకున్న రాజేంద్ర.. కొన్ని నెలల క్రితం సీతను ముంబై రావాల్సిందిగా చెప్పాడు. పెళ్లి చేసుకుంటానన్నాడు. దీన్ని నమ్మిన సీత ఐదు సవర్ల నగలు, రూ.30వేల నగదు ఇంటి నుంచి వచ్చేసింది. ముంబైలో వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. 
 
45 రోజుల పాటు సహజీవనం చేశారు. ఈ నేపథ్యంలో సీత తనను వివాహం చేసుకోవాల్సిందిగా బలవంతపెట్టింది. అంతే మంగళూరులో వివాహం చేసుకుందామంటూ వెంటబెట్టుకుని వచ్చిన రాజేంద్ర రైలులోనే ఆమెను వదిలిపెట్టి జంప్ అయ్యాడు. ఈ విషయాన్ని మంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో సీత తన సొంతూరులోనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments