నిలిచిన ఛార్‌దామ్ యాత్ర... భక్తులను శ్రీనగర్‌లో నిలిపివేత

Webdunia
ఆదివారం, 30 ఏప్రియల్ 2023 (14:02 IST)
ఛార్‌దామ్ యాత్ర నిలిచిపోయింది. ఓ వైపు వర్షం, మరోవైపు విపరీతమైన మంచు కురుస్తుండటంతో యాత్ర ఆగిపోయింది. అధికారులు యాత్రికులను శ్రీనగర్‌లో నిలిపివేశారు. ఉత్తరాఖండ్ ఎన్.ఐ.టి, బద్రీనాథ్ బస్టాండ్ ఏరియాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి భక్తుల రాకపోకలను నియంత్రిస్తున్నారు. 
 
వాతావరణం ఏమాత్రం అనుకూలంగా లేకపోవడంతో భక్తుల రక్షణ నిమిత్తం ఈ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. ముందు జాగ్రత్తగా యాత్రికులను పోలీసు అధికారులు శ్రీనగర్‌లోనే నిలిపివేశారు. రాత్రిపూట బస ఏర్పాట్లను ముందే ఆన్‌లైన్‌లో రిజర్వు చేసుకున్న వారిని మాత్రమే రుద్రప్రయాగ్ వరకు అనుమతిస్తున్నట్టు అధికారులు తెలిపారు. మిగిలిన వారంతా శ్రీనగర్‌లోనే ఉండాలని ఆదేశించారు.
 
యాత్రికుల భద్రత దృష్ట్యా వాతావరణం క్లియర్ అయ్యేంత వరకు ముందుకు అనుమతించలేమని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఇందుకోసం శ్రీనగర్‌లో ఛార్ దామ్ యాత్రికులు ఎక్కువగా ఆగే ప్రాంతాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి, ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sri Vishnu: ఒంగోలు నేపథ్యంలో శ్రీ విష్ణు, నయన్ సారిక జంటగా చిత్రం

Srikanth: ఇట్లు మీ వెధవ.. సినిమా చిత్ర బృందంపై శ్రీకాంత్ సెటైర్

Venu Swamy: రామ్ చరణ్- ఉపాసనల ట్విన్ బేబీస్.. వేణు స్వామి జ్యోతిష్యం తప్పిందిగా?

Upasana: రామ్ చరణ్, ఉపాసనకు ట్విన్ బేబీస్ రానున్నారా? (video)

Rebel Star Prabhas: ఫ్యాన్స్ లేకపోతే నేను జీరో అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments