Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిలిచిన ఛార్‌దామ్ యాత్ర... భక్తులను శ్రీనగర్‌లో నిలిపివేత

Webdunia
ఆదివారం, 30 ఏప్రియల్ 2023 (14:02 IST)
ఛార్‌దామ్ యాత్ర నిలిచిపోయింది. ఓ వైపు వర్షం, మరోవైపు విపరీతమైన మంచు కురుస్తుండటంతో యాత్ర ఆగిపోయింది. అధికారులు యాత్రికులను శ్రీనగర్‌లో నిలిపివేశారు. ఉత్తరాఖండ్ ఎన్.ఐ.టి, బద్రీనాథ్ బస్టాండ్ ఏరియాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి భక్తుల రాకపోకలను నియంత్రిస్తున్నారు. 
 
వాతావరణం ఏమాత్రం అనుకూలంగా లేకపోవడంతో భక్తుల రక్షణ నిమిత్తం ఈ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. ముందు జాగ్రత్తగా యాత్రికులను పోలీసు అధికారులు శ్రీనగర్‌లోనే నిలిపివేశారు. రాత్రిపూట బస ఏర్పాట్లను ముందే ఆన్‌లైన్‌లో రిజర్వు చేసుకున్న వారిని మాత్రమే రుద్రప్రయాగ్ వరకు అనుమతిస్తున్నట్టు అధికారులు తెలిపారు. మిగిలిన వారంతా శ్రీనగర్‌లోనే ఉండాలని ఆదేశించారు.
 
యాత్రికుల భద్రత దృష్ట్యా వాతావరణం క్లియర్ అయ్యేంత వరకు ముందుకు అనుమతించలేమని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఇందుకోసం శ్రీనగర్‌లో ఛార్ దామ్ యాత్రికులు ఎక్కువగా ఆగే ప్రాంతాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి, ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెండు భాగాలుగా మహేశ్ బాబు - రాజమౌళి యాక్షన్ అడ్వెంచర్ మూవీ?

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

ఆకాశంలో పొట్టేల్ ప్రమోషన్.. పాంప్లేట్లు పంచారు.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments