Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిస్టమ్ మారింది.. ఎక్కడా అవినీతి లేదు... 71 వేల మందికి ఉద్యోగాలు

Webdunia
మంగళవారం, 16 మే 2023 (14:14 IST)
దేశ వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలకు ఎంపికైన 71 వేల మందికి నియామక పత్రాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పంపిణీ చేశారు. మంగళవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన కార్యక్రమంలో ఈ నియామక పత్రాలను ప్రధాని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడం కష్టంగా ఉండేదని, దరఖాస్తు పొందేందుకు సైతం గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సి వచ్చేదని అన్నారు. 
 
కానీ, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రిక్రూట్మెంట్ విధానం పూర్తిగా మారిపోయిందన్నారు. అప్లికేషన్ నుంచి ఫలితాలు వెల్లడయ్యేంత వరకు అన్నీ ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయన్నారు. కొన్ని ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు కూడా అవసరం లేదని అన్నారు. కొత్త విధానంతో రిక్రూట్మెంట్ విషయంలో అవినీతి బంధుప్రీతి పూర్తిగా నిర్మూలించామన్నారు. 
 
కాగా, గత యేడాది అక్టోబరు నెలలో రోజ్‌గార్ మేళాను ప్రధాని ప్రారంభించారు. పది లక్షల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇప్పటివరకు మోదీ సర్కారు 2.9 లక్షల మందికి అపాయింట్మెంట్ లెటర్‌లను పంపిణీ చేయగా, తాజాగా కార్యక్రమంతో కలిసి ఆ సంఖ్య 3.6 లక్షలకు చేరుకుందని కేంద్రం వివరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments