Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిస్టమ్ మారింది.. ఎక్కడా అవినీతి లేదు... 71 వేల మందికి ఉద్యోగాలు

Webdunia
మంగళవారం, 16 మే 2023 (14:14 IST)
దేశ వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలకు ఎంపికైన 71 వేల మందికి నియామక పత్రాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పంపిణీ చేశారు. మంగళవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన కార్యక్రమంలో ఈ నియామక పత్రాలను ప్రధాని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడం కష్టంగా ఉండేదని, దరఖాస్తు పొందేందుకు సైతం గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సి వచ్చేదని అన్నారు. 
 
కానీ, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రిక్రూట్మెంట్ విధానం పూర్తిగా మారిపోయిందన్నారు. అప్లికేషన్ నుంచి ఫలితాలు వెల్లడయ్యేంత వరకు అన్నీ ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయన్నారు. కొన్ని ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు కూడా అవసరం లేదని అన్నారు. కొత్త విధానంతో రిక్రూట్మెంట్ విషయంలో అవినీతి బంధుప్రీతి పూర్తిగా నిర్మూలించామన్నారు. 
 
కాగా, గత యేడాది అక్టోబరు నెలలో రోజ్‌గార్ మేళాను ప్రధాని ప్రారంభించారు. పది లక్షల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇప్పటివరకు మోదీ సర్కారు 2.9 లక్షల మందికి అపాయింట్మెంట్ లెటర్‌లను పంపిణీ చేయగా, తాజాగా కార్యక్రమంతో కలిసి ఆ సంఖ్య 3.6 లక్షలకు చేరుకుందని కేంద్రం వివరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?

ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments