Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలవరం ప్రాజెక్టును ఆపాలని చూస్తారా? దేనికైనా సిద్ధమే: బీజేపికి బాబు సవాల్

ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడుతూ.. బీజేపీ, జనసేన, వైసీపీలపై మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టును ఆపేందుకు చూస్తున్నారని.. ఇందుకు పవన్, జగన్‌లను అడ్డుపెట్టుకుని బీజేపీ కుట్ర చేస్తుందని చంద్రబాబు ఆర

Webdunia
గురువారం, 22 మార్చి 2018 (12:53 IST)
ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడుతూ.. బీజేపీ, జనసేన, వైసీపీలపై మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టును ఆపేందుకు చూస్తున్నారని.. ఇందుకు పవన్, జగన్‌లను అడ్డుపెట్టుకుని బీజేపీ కుట్ర చేస్తుందని చంద్రబాబు ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టును ఆపి.. సీబీఐ ఎంక్వయిరీలని.. వైసీపీ, జనసేనలతో బీజేపీ ఆరోపణలు చేయిస్తుందని చెప్పారు. 
 
సీబీఐ విచారణకు ఆదేశించడం ద్వారా ప్రాజెక్టును ఆపాలనేదే బీజేపీ ఉద్దేశమని చంద్రబాబు స్పష్టం చేశారు. పోలవరంపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని, ఏ ప్రాజెక్టును ఆపాలని చూసినా ఊరుకునే ప్రసక్తే లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. 
 
బీజేపీ జగన్, పవన్‌ను అడ్డుపెట్టుకుని తనపై కుట్ర చేస్తోందని.. దమ్ముంటే ప్రత్యేక హోదాపై రాష్ట్రానికి ఇచ్చిన నిధులపై పార్లమెంట్ వేదికగా చర్చించాలని సవాల్ విసిరారు. విభజన చట్టంలోని హోదా మినహా మిగతా 19 అంశాలు, ఆరు హామీలపై ఏనాడు కూడా వైసీపీ ప్రశ్నించలేదని మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments