Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్ డౌన్ కాలంలో పెట్రోల్ మోటార్ సైకిల్‌ తయారు చేసిన బాలుడు

Webdunia
గురువారం, 3 సెప్టెంబరు 2020 (19:33 IST)
Motorcycle
కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్‌ విధించడంతో చాలామంది ఇంటి పట్టునే వుండిపోయారు. ఇంట్లో సమయాన్ని వృధా చేస్తూ.. టీవీలకు అతుక్కుపోయిన వారు చాలామందే వుండివుంటారు. కానీ ఓ బుడ్డోడు ఖాళీ సమయాన్ని వృధా చేయకుండా.. ఓ బండి తయారు చేశాడు. ఖాళీగా ఉండే వారిలో కొందరికి చాలా మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలా పదవ తరగతి చదివే బాలుడికి కొత్త ఐడియా వచ్చింది. 
 
లాక్‌డౌన్‌లో ఖాళీ‌గా ఉండలేక ఏకంగా ఆ బాలుడు బైక్ తయారు చేసుకుని సంచలనం సృష్టించాడు. కేంద్ర పాలిత ప్రాంతమైన ఛండీగడ్‌లో పదవ తరగతి విద్యార్థి గౌరవ్ స్క్రాప్ మెటీరియల్ ఉపయోగించి.. మోటారు సైకిల్ తయారు చేశాడు.
 
ఈ సందర్భంగా అతను మీడియాతో మాట్లాడుతూ.. తాను 3 సంవత్సరాల క్రితం స్క్రాప్ మెటీరియల్ ఉపయోగించి ఎలక్ట్రిక్ బైక్ తయారు చేశానని తెలిపాడు. కానీ అది స్పీడ్‌గా వెళ్లలేకపోవడంతో.. తాను ప్రస్తుతం పెట్రోల్ మోటార్ సైకిల్‌గా దాన్ని మార్చానని వెల్లడించాడు. అది లీటరు 80 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందని వివరించాడు. ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎపుడు.. ఎక్కడ?

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments