వాష్రూమ్లో సీసీ టీవీ కెమెరా... విద్యార్థినిలు కాలకృత్యాలు తీర్చుకుంటుంటే...
బాత్రూమ్లో కాలకృత్యాలు చేసుకునే విద్యార్థినులను సెల్ఫోన్ ద్వారా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వీడియో తీసిన ఘటన మంగళూరులో చోటుచేసుకుంది. ఆ వివరాలను పరిశీలిస్తే... మంగళూరు యూనివర్సిటీలో విద్యార్థినుల
బాత్రూమ్లో కాలకృత్యాలు చేసుకునే విద్యార్థినులను సెల్ఫోన్ ద్వారా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వీడియో తీసిన ఘటన మంగళూరులో చోటుచేసుకుంది. ఆ వివరాలను పరిశీలిస్తే... మంగళూరు యూనివర్సిటీలో విద్యార్థినులు కాలకృత్యాలు తీర్చుకునే వాష్రూమ్లో గత నెల 24వ తేదీన ఈ ఘటన జరిగింది. కాలకృత్యాలు తీర్చుకునేందుకు టాయ్లెట్ రూమ్కు వెళ్లిన ఓ యువతి అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి అవాక్కయ్యింది.
వాష్రూమ్ రూఫ్కు రంధ్రం ఉండటాన్ని గమనించి కాలేజి యాజమాన్యానికి అసలు విషయాన్ని తెలియజేసింది. ఛైర్మన్ వచ్చి టాయిలెట్ని పరిశీలించగా... ఆ రంధ్రంలో ఓ సెల్ఫోన్ దొరికింది. ఆ సెల్ఫోన్ని తీసి చూస్తే అందులో సిమ్ కార్డ్ లేదు. కానీ అందులో విద్యార్థినుల అసభ్యకర దృశ్యాలు రికార్డయ్యాయి.
ఒకటి కాదు... రెండు కాదు ఎంతో మంది యువతులు వాష్రూమ్లో కాలకృత్యాలు తీర్చుకుంటుండగా గుర్తుతెలియని దుండగులు ఆ వీడియోలను చిత్రీకరించారు. యాజమాన్యం వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ సెల్ఫోన్ను సీజ్ చేశారు. సెక్యూరిటీ విషయంలో యాజమాన్యం వైఖరిని విద్యార్థినులు వారి తల్లిదండ్రులు తప్పుబడుతున్నారు.