Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత మృతిపై అనుమానాలున్నాయ్.. సీబీఐ విచారణ జరిపించాలి: తెలుగు యువశక్తి

దివంగత సీఎం జయలలిత మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని తమిళ తెలుగు యువశక్తి సంస్థ డిమాండ్ చేసింది. అపోలో ఆస్పత్రిలో 75 రోజులపాటు చికిత్స కొనసాగించడం, పూర్తిగా కోలుకున్నారని చెప్పిన తర్వాత గుండెపోటు కారణంగ

Webdunia
ఆదివారం, 11 డిశెంబరు 2016 (13:30 IST)
దివంగత సీఎం జయలలిత మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని తమిళ తెలుగు యువశక్తి సంస్థ డిమాండ్ చేసింది. అపోలో ఆస్పత్రిలో 75 రోజులపాటు చికిత్స కొనసాగించడం, పూర్తిగా కోలుకున్నారని చెప్పిన తర్వాత గుండెపోటు కారణంగా మరణించారని చెప్పడం నమ్మశక్యంగా లేదని, జయలలిత మరణం వెనుక దాగిన రహస్యాలను ఛేదించేందుకు సీబీఐ విచారణ జరపాలని సంస్థ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్ రెడ్డి ప్రకటించారు.
 
జయలలిత మరణంలోని నిజానిజాలు వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వం సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కేతిరెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ అంశంపై రాష్ట్రపతి, ప్రధానమంత్రి, పార్లమెంట్‌, రాజ్యసభ సభ్యులు జోక్యం చేసుకోవాలని కేతిరెడ్డి కోరారు.
 
జయపై స్లో పాయిజన్ ప్రయోగం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయని, వాటిని శశికళే స్వయంగా అందజేసిందని తెలిసి 2011 డిసెంబర్‌లో శశికళను పార్టీ నుంచి తొలగించిన విషయాన్ని గుర్తుచేశారు. 2011 నుంచి ఇప్పటివరకు వరకు జయలలితపై కుట్ర జరిగిందని, ఈ విషయంలో శశికళ చర్యలు సందేహాస్పదంగా ఉన్నాయని ప్రకటనలో అనుమానం వ్యక్తం చేశారు. 
 
ఇక జ్వరం, డీహైడ్రేషన్ కారణంగా ఆస్పత్రిలో చేరిన జయకు 75 రోజులపాటు చికిత్స కొనసాగించడంపై అనుమానాలున్నాయని చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, జాతీయ నాయకులు, అధికారులు, స్వయంగా గవర్నర్‌ వచ్చినా జయలలితను కలవడానికి అనుమతించకుండా కేవలం శశికళ మాత్రమే గదిలోకి వెళ్లడం అనుమానాలకు తావిస్తోందనిన్నారు. జయలలిత సొంత బంధువులున్నా అంత్యక్రియలు కూడా శశికళ నిర్వహించడాన్ని ప్రజలు తప్పుబడుతున్నారని కేతిరెడ్డి అన్నారు.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments