కావేరీ జలాలపై ఏ ఒక్కరికీ హక్కు లేదు : సుప్రీంకోర్టు

కొన్ని దశాబ్దాల నుంచి వివాదాస్పదంగా మారిన కావేరీ జలాల పంపిణీ వ్యవహారంపై సుప్రీంకోర్టు శుక్రవారం చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. కావేరీ జలాలపై ఏ ఒక్క రాష్ట్రానికీ హక్కు లేదని తేల్చి చెప్పింది.

Webdunia
శుక్రవారం, 16 ఫిబ్రవరి 2018 (10:47 IST)
కొన్ని దశాబ్దాల నుంచి వివాదాస్పదంగా మారిన కావేరీ జలాల పంపిణీ వ్యవహారంపై సుప్రీంకోర్టు శుక్రవారం చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. కావేరీ జలాలపై ఏ ఒక్క రాష్ట్రానికీ హక్కు లేదని తేల్చి చెప్పింది. అదేసమయంలో ఆయా రాష్ట్రాలకు కేటాయించాల్సిన నీటిపై కూడా స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు సుప్రీంకోర్చు చీఫ్‌ జస్టిస్ దీపక్ మిశ్రా సారథ్యంలోని బెంచ్ 10.30 గంటల ప్రాంతంలో తీర్పును వెలువరించింది. 
 
జలాల పంపకాలకు సంబంధించి కావేరీ జల వివాద ట్రిబ్యునల్ (సీడబ్ల్యూడీటీ) 2007లో ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ మూడు రాష్ట్రాలు వేసిన పిటిషన్లపై విచారణ అనంతరం బెంచ్ తీర్పునిచ్చింది. గత 8 నెలల్లో 28 రోజుల పాటు ఈ పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు బెంచ్ తీర్పును 2017 సెప్టెంబర్ 20న రిజర్వ్ చేసింది. నెలలోగా తీర్పును వెలువరిస్తామని గత జనవరిలో సుప్రీంకోర్టు ప్రకటించింది.
 
కాగా, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల మధ్య కొన్ని దశాబ్దాలుగా కావేరి జలాల వివాదం నలుగుతున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. ఈ తీర్పు ప్రకారం తమిళనాడుకు 177.25 టీఎంసీలు, కర్ణాటక రాష్ట్రానికి 184.75 టీఎంసీల నీటిని కేటాయించాలని, కేరళ (17 టీఎంసీలు), పుదుచ్చేరి (7 టీెఎంసీలు) రాష్ట్రాలకు యధావిధిగానే కేటాయింపులు జరపాలని స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil Raj: అఖిల్ రాజ్ హీరోగా సతీష్ గోగాడ దర్శకత్వంలో అర్జునుడి గీతోపదేశం

Raashi Singh: త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి లైఫ్ ఈజ్ ఎ గేమ్.. లిరికల్ సాంగ్

Suresh Babu: ఎమోసనల్‌ డ్రామా పతంగ్‌ చిత్రం : సురేష్‌బాబు

Anita Chowdhury: అంబాసిడర్ కారులో పదిమంది కుక్కేవారు : అనితా చౌదరి

మంచి ప్రేమ కథతో వస్తున్న లవ్ డేస్ పెద్ద విజయం సాధించాలి : సముద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments