Webdunia - Bharat's app for daily news and videos

Install App

కావేరీ జలాలపై ఏ ఒక్కరికీ హక్కు లేదు : సుప్రీంకోర్టు

కొన్ని దశాబ్దాల నుంచి వివాదాస్పదంగా మారిన కావేరీ జలాల పంపిణీ వ్యవహారంపై సుప్రీంకోర్టు శుక్రవారం చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. కావేరీ జలాలపై ఏ ఒక్క రాష్ట్రానికీ హక్కు లేదని తేల్చి చెప్పింది.

Webdunia
శుక్రవారం, 16 ఫిబ్రవరి 2018 (10:47 IST)
కొన్ని దశాబ్దాల నుంచి వివాదాస్పదంగా మారిన కావేరీ జలాల పంపిణీ వ్యవహారంపై సుప్రీంకోర్టు శుక్రవారం చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. కావేరీ జలాలపై ఏ ఒక్క రాష్ట్రానికీ హక్కు లేదని తేల్చి చెప్పింది. అదేసమయంలో ఆయా రాష్ట్రాలకు కేటాయించాల్సిన నీటిపై కూడా స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు సుప్రీంకోర్చు చీఫ్‌ జస్టిస్ దీపక్ మిశ్రా సారథ్యంలోని బెంచ్ 10.30 గంటల ప్రాంతంలో తీర్పును వెలువరించింది. 
 
జలాల పంపకాలకు సంబంధించి కావేరీ జల వివాద ట్రిబ్యునల్ (సీడబ్ల్యూడీటీ) 2007లో ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ మూడు రాష్ట్రాలు వేసిన పిటిషన్లపై విచారణ అనంతరం బెంచ్ తీర్పునిచ్చింది. గత 8 నెలల్లో 28 రోజుల పాటు ఈ పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు బెంచ్ తీర్పును 2017 సెప్టెంబర్ 20న రిజర్వ్ చేసింది. నెలలోగా తీర్పును వెలువరిస్తామని గత జనవరిలో సుప్రీంకోర్టు ప్రకటించింది.
 
కాగా, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల మధ్య కొన్ని దశాబ్దాలుగా కావేరి జలాల వివాదం నలుగుతున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. ఈ తీర్పు ప్రకారం తమిళనాడుకు 177.25 టీఎంసీలు, కర్ణాటక రాష్ట్రానికి 184.75 టీఎంసీల నీటిని కేటాయించాలని, కేరళ (17 టీఎంసీలు), పుదుచ్చేరి (7 టీెఎంసీలు) రాష్ట్రాలకు యధావిధిగానే కేటాయింపులు జరపాలని స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

వాళ్లు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ టుక్‌టుక్‌ చిత్రం విజయంపై నమ్మకం పెరిగింది : నిర్మాత రాహుల్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments