Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాగి చెంపపై కొట్టిన తనయుడు... ఒక్క దెబ్బకు తల్లి మృతి.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 19 మార్చి 2021 (07:40 IST)
పార్కింగ్ గొడవ ఓ తల్లి ప్రాణం తీసింది. బలంగా తల్లి చెంపపై కొడుకు కొట్టడంతో ఆమె అక్కడే కుప్పకూలి కిందపడిపోయింది. ఇదంతా సీసీటీవీ కెమెరాలో రికార్డు కావడంతో ఈ వ్యవహారం బయటకు పొక్కింది. ఢిల్లీలోని ద్వార్కా ప్రాంతంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన  ఈ వివరాలను పరిశీలిస్తే, పొరుగింటి వారితో పార్కింగ్ విషయంలో ఓ కుటుంబానికి గొడవ వచ్చింది. దీని గురించి మాట్లాడటం కోసం ఆ ఇంటికి వెళ్లిన సమయంలో 76 ఏళ్ల వృద్ధురాలు, ఆమె కుమారుడు రణ్‌బీర్, కోడలు శుద్రా బిస్త్ రోడ్డుపై నిలబడి వాదించుకున్నారు. 
 
ఈ సమయంలో మాటల మధ్య ఆగ్రహం తెచ్చుకున్న రణ్‌బీర్.. తన ముసలి తల్లిని బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు అలానే నేలపై పడిపోయిన ఆమె చలనం లేకుండా ఉండిపోయింది. రణ్‌బీర్ చేసిన ఘనకార్యం అక్కడి సీసీటీవీ ఫుటేజిలో రికార్డవడంతో వారు చేసిన ఘోరం బయటపడింది. 
 
సమాచారం అందుకున్న పోలీసులు... అక్కడకు వచ్చిన కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా, నేలపై పడి చలనం లేకుండా ఉన్న వృద్ధురాలిని శుద్రా దంపతులు ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు తెలిసింది. అయితే అక్కడకు వెళ్లేసరికే ఆ ముసలి ప్రాణం గాల్లో కలిసిపోయినట్లు వైద్యులు ప్రకటించారని దర్యాప్తులో వెల్లడైంది.

 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments