Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆవుల చెవులకు డిజిటల్ చిప్... ఎందుకో తెలుసా?

Webdunia
శుక్రవారం, 16 నవంబరు 2018 (12:14 IST)
గోవుల అక్రమ రవాణా, గోవధ నియంత్రణకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నడుంబిగించింది. ఇందులోభాగంగా గోవులు ఎక్కడున్నా వాటిని సులభంగా గుర్తించేందుకు వీలుగా డిజిటల్ చిప్స్‌ను ఆవుల చెవుల్లో అమర్చనున్నారు. 
 
ఈ డిజిటల్ చిప్‌ల విధానంలో భాగంగా, చెవుల్లో ఐడీ నంబరుతో కూడిన జీపీఎస్ ఆధారిత డిజిటల్ చిప్‌లను అమర్చుతారు. ఈ డిజిటల్ చిప్ ధర ఒక్కొక్కటి ఆరు రూపాయలు. గోవుల అక్రమ రవాణాకు ఈ డిజిటల్ చిప్స్ ఎంతగానో ఉపయోగపడుతాయని ఆ రాష్ట్ర ప్రభుత్వం బలంగా చెబుతోంది. ముఖ్యంగా, ఈ చిప్ ఆధారంగా ఆవులు ఎక్కడున్నా సులభంగా కనిపెట్టవచ్చని, అందువల్ల రైతులు ఇక నిశ్చింతగా ఉండొచ్చని చెప్పింది. 
 
ఈ చిప్‌లలో ఆవులకు కేటాయించిన నంబరు, వాటి చిరునామా, రంగు, ఆరోగ్య పరిస్థితులతో కూడిన వివరాలను డిజిటల్ రూపంలో నమోదు చేయనున్నారు. కాగా, రాష్ట్రంలో మొత్తం 71 లక్షల పాలిచ్చే ఆవులు ఉండగా, 1.30 లక్షల పశువులు ఉన్నాయని ఆ రాష్ట్ర పశుసంవర్థక మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments