Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆవుల చెవులకు డిజిటల్ చిప్... ఎందుకో తెలుసా?

Webdunia
శుక్రవారం, 16 నవంబరు 2018 (12:14 IST)
గోవుల అక్రమ రవాణా, గోవధ నియంత్రణకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నడుంబిగించింది. ఇందులోభాగంగా గోవులు ఎక్కడున్నా వాటిని సులభంగా గుర్తించేందుకు వీలుగా డిజిటల్ చిప్స్‌ను ఆవుల చెవుల్లో అమర్చనున్నారు. 
 
ఈ డిజిటల్ చిప్‌ల విధానంలో భాగంగా, చెవుల్లో ఐడీ నంబరుతో కూడిన జీపీఎస్ ఆధారిత డిజిటల్ చిప్‌లను అమర్చుతారు. ఈ డిజిటల్ చిప్ ధర ఒక్కొక్కటి ఆరు రూపాయలు. గోవుల అక్రమ రవాణాకు ఈ డిజిటల్ చిప్స్ ఎంతగానో ఉపయోగపడుతాయని ఆ రాష్ట్ర ప్రభుత్వం బలంగా చెబుతోంది. ముఖ్యంగా, ఈ చిప్ ఆధారంగా ఆవులు ఎక్కడున్నా సులభంగా కనిపెట్టవచ్చని, అందువల్ల రైతులు ఇక నిశ్చింతగా ఉండొచ్చని చెప్పింది. 
 
ఈ చిప్‌లలో ఆవులకు కేటాయించిన నంబరు, వాటి చిరునామా, రంగు, ఆరోగ్య పరిస్థితులతో కూడిన వివరాలను డిజిటల్ రూపంలో నమోదు చేయనున్నారు. కాగా, రాష్ట్రంలో మొత్తం 71 లక్షల పాలిచ్చే ఆవులు ఉండగా, 1.30 లక్షల పశువులు ఉన్నాయని ఆ రాష్ట్ర పశుసంవర్థక మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments