Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవై ఆస్పత్రిలో వృద్ధురాలి మృతదేహాన్ని కొరికి తిన్న పిల్లి.. వీడియో వైరల్

Webdunia
మంగళవారం, 20 నవంబరు 2018 (13:17 IST)
కోయంబత్తూరులో దారుణం చోటుచేసుకుంది. కోవై ప్రభుత్వాసుపత్రిలో ఓ వృద్ధురాలి మృతదేహాన్ని పిల్లి కొరికి తినింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. కోవై ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఓ వృద్ధురాలు సోమవారం రాత్రి ప్రాణాలు కోల్పోయింది. ఆమె మృతదేహాన్ని ఎవరూ తీసుకునేందుకు రాని కారణంగా.. ఆస్పత్రి సిబ్బంది మార్చురీలో వుంచకుండా.. వార్డులోనే వదిలిపెట్టేశారు. 
 
ఈ నేపథ్యంలో ఓ పిల్లి వృద్ధురాలి మృతదేహాన్ని కొరికి తింది. దీనిపై కొందరు యువకులు ఆస్పత్రి సిబ్బందిని నిలదీసినా వారి నుంచి నిర్లక్ష్యంగా బదులు వచ్చింది. దీంతో ఆగ్రహించిన యువకులు వృద్ధురాలి మృతదేహాన్ని పిల్లి కొరికి తిన్న వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. 
 
ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో.. ఆ మృతదేహాన్ని మార్చురీలోకి తీసుకెళ్లారు. ఈ ఘటనపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments