ప్రేమించిన అమ్మాయిని చంపేశాడు.. వేరొక వ్యక్తితో లవ్ ఎఫైర్ వుందని..?

Webdunia
సోమవారం, 30 నవంబరు 2020 (16:39 IST)
తాను ప్రేమించిన అమ్మాయికి మరొకరితో లవ్ ఎఫైర్ వుందనే అనుమానంతో తాను ప్రేమించిన అమ్మాయిని కిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటన యూపీలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. బల్లియా జిల్లా లక్ష్మీపూర్‌కి చెందిన రితిక (18)ను ఆమె పక్కింట్లో ఉండే సయ్యద్ అలీ ప్రేమించాడు. ఆమెతో మాట్లాడేందుకు.. ఆమెకు దగ్గరయ్యేందుకు అతడు ప్రయత్నించేవాడు. యువతి కూడా అతనితో బాగానే మాట్లాడేది. ఈ క్రమంలో ఉపాధి కోసం అలీ ఢిల్లీకి వెళ్లాడు. 
 
ఇటీవలే గ్రామానికి తిరిగొచ్చాడు. అప్పటి నుంచి రితికతో అలీ.. చనువుగా ఉండేందుకు ప్రయత్నించాడు. కాని ఆమె అతడిని దూరం పెట్టింది. ఆమెకు మరొకరితో లవ్ ఎఫైర్ ఉందన్న అనుమానంతో అలీ దారుణానికి తెగబడ్డాడు. తన స్నేహితులతో కలసి పొలం దగ్గరకు వెళ్తున్న యువతిని కాపుకాసి కిరాతకంగా హత్య చేశాడు. ఆ దారుణాన్ని కళ్లారా చూసిన స్థానికులు అతడిని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi: క్లైమాక్స్ ఫైట్ షూటింగ్ లో మన శంకరవరప్రసాద్ గారు

Prashanth Varma: నా పై ఆరోపణలు అబద్దం, ప్రతీకారం గా జరుగుతున్నాయి: ప్రశాంత్ వర్మ

Suma: దంపతుల జీవితంలో సుమ కనకాల ఎంట్రీ తో ఏమయిందనే కథతో ప్రేమంటే

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments