Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరుడి గెటప్ వేసుకుని గుర్రంపై వెళ్లి లోక్‌సభకు నామినేషన్ వేశాడు..

Webdunia
మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (11:38 IST)
భారతదేశంలో సార్వత్రిక ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. పోటీలో నిలిచిన అభ్యర్థులు ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా ఓ అభ్యర్థి లోక్‌సభకు పోటీ చేసేందుకు నామినేషన్ వేయడానికి ఎవ్వరూ ఊహించని రీతిలో కలెక్టర్ ఆఫీస్ చేరుకున్నాడు. ఇంతకీ అతను ఏమి చేసాడు అని ఆలోచిస్తున్నారా? 
 
ఉత్తరప్రదేశ్‌లోని షాహజహాన్‌పూర్‌లో లోక్‌సభకు పోటీ చేస్తున్న సంయుక్త్‌ వికాస్‌ పార్టీ అభ్యర్థి వైద్‌ రాజ్‌ కిషన్‌.. పెళ్లి కుమారుడు వలె ముస్తాబై వెళ్లి నామినేషన్‌ వేశాడు. షేర్వానీ వేసుకుని పెళ్లికొడుకులా గుర్రంపై బారాత్‌ తీశాడు. బారాత్‌ తీసిన ఆ అభ్యర్థి చుట్టూ భారీ సంఖ్యలో జనం కూడా చేరారు. బాలీవుడ్‌ పాటలకు చిందులేస్తూ ర్యాలీ తీశారు. వరుడి గెటప్‌తో వచ్చిన కిషన్‌ స్థానికులను ఆశ్చర్యపరిచాడు. 
 
రాజకీయాలకు అల్లుడినంటూ తన వేషధారణపై కామెంట్‌ కూడా చేశాడు. ఇవాళ తన పెళ్లి రోజు అని, అందుకే వరుడి వేషంలో వచ్చానని, నామినేషన్‌ వేసేందుకు అల్లుడిలా వచ్చినట్లు కిషన్‌ చెప్పాడు. కలెక్టర్‌ ఆఫీసులో నామినేషన్‌ వేసేందుకు వెళ్తున్న కిషన్‌ను పోలీసులు ముందే అడ్డుకున్నారు. సర్దార్‌ బజార్‌ ఏరియాలో అతన్ని ఆపేశారు. అక్కడ నుంచి అతను నడుచుకుంటూ వెళ్లి నామినేషన్‌ వేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments