Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆధారాలు లేకుండా ఈవీఎంలను తప్పుబట్టలేం : సుప్రియా సూలే

ఠాగూర్
గురువారం, 26 డిశెంబరు 2024 (18:38 IST)
కాంగ్రెస్ పార్టీతో పాటు పలు రాజకీయ పార్టీలు ఈవీఎం పనితీరుపై నిందారోపణలు చేస్తున్నాయి. ఈవీఎంలను హ్యాక్ చేసి బీజేపీ ఎన్నికల్లో గెలుస్తుందంటూ ఆరోపణలు చేస్తున్నాయి. అయితే, ఎన్సీపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి మాజీ మంత్రి శరద్ పవార్ కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే మాత్రం ఈవీఎంలను తప్పుబట్టడం లేదు. ఈవీఎంల ద్వారా జరిగిన ఎన్నికల్లో తాను నాలుగుసార్లు విజయం సాధించానని, అలాంటపుడు అందులో స్కాం ఉందని ఎలా చెప్పగలుగుతామని చెప్పారు. 
 
అయితే, ఈవీఎంలలో అవకతవకలపై కొంతమంది ఆరోపణలు చేస్తున్నారని, ఇందులో అవాస్తవాలను బయటకు తీసుకొచ్చేలా చర్చ జరగాల్సి ఉందని ఆమె అన్నారు. ఓటర్ల జాబితాపై చాలా మంది ప్రశ్నలు లేవనెత్తుతున్నారని, కాబట్టి ఈవీఎం అయినా, బ్యాలెట్ పేపర్ అయినా పారదర్శకంగా జరిగితే ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. అయితే, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమేనని చెప్పారు. ప్రజలు బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు జరగాలని కోరుకుంటే అలాగే చేయాలని, ఈవీఎంలు కావాలనుకుంటే వాటినే ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments