Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్‌ మచ్చూ నదిపై తెగిన కేబుల్ బ్రిడ్జి - 32 మంది మృత్యువాత

Webdunia
ఆదివారం, 30 అక్టోబరు 2022 (22:11 IST)
గుజరాత్ రాష్ట్రంలో పెను విషాదం చోటుచేసుకుంది. మోర్బీ ప్రాంతంలో కేబుల్ వంతెన తెగిపోయింది. దీంతో 32 మంది మృత్యువాతపడ్డారు. మరో 400 మంది వరకు గాయపడ్డారు. వీరిలో 70 మందిని ప్రాణాపాయస్థితి నుంచి కాపాడారు. 
 
గుజరాత్ రాష్ట్రంలోని మచ్చూ నదిపై కేబుల్ బ్రిడ్జి ఎప్పటి నుంచో ఉండగా, ఐదు రోజుల క్రితమే ఈ కేబుల్ వంతెనకు ఆధునకీకరణ పనులుచేశారు. ఈ వంతెన దాటుతుండగా ఒక్కసారిగా తెగిపోయింది. 
 
ఆ సమయంలో వంతెనపై దాదాపు 500 మంది వరకు ఉన్నట్టు సమాచారం.  వంతెన కూలిపోగానే చాలా మంది నదిలో పడిపోయారు. వీరిలో ఈత తెలిసినవారు మాత్రం ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. అయినప్పటికీ 32 మంది చనిపోయారు. 
 
ప్రమాద వార్త తెలియగానే ప్రధాని మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో మాట్లాడి ఈ ఘటన వివరాలను తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. 
 
అంతేకాకుండా, ఈ ప్రమాదంలో చనిపోయిన వారి మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు, కేంద్రం రూ.2 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించాయి. గాయపడిన వారికి రూ.50 వేలు సాయాన్ని ప్రకటించాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రూబా లో సరికొత్త ప్రేమ కథను చూస్తారు - దర్శకుడు విశ్వ కరుణ్

Vijayashanti: కళ్యాణ్ రామ్, విజయశాంతి మూవీ టైటిల్ అర్జున్ S/O వైజయంతి

Rukshar Dhillon: హాపీ ఉమన్స్ డే గా నటి రుక్సార్ ధిల్లాన్ ఘాటు విమర్శలు

దర్శకులు మెచ్చుకున్న 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో చిత్రం.. ఫుల్ ఫన్ రైడ్

సమాజంలో మార్పుకే కీప్ ది ఫైర్ అలైవ్ ఫిల్మ్ తీసాం : చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tandoori Chicken Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ ఈజీగా ఎలా చేయాలి?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

ప్రతిరోజూ పసుపు, జీలకర్ర నీటిని తీసుకుంటే..? మహిళల్లో ఆ సమస్యలు మాయం

తర్వాతి కథనం
Show comments