Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్‌ మచ్చూ నదిపై తెగిన కేబుల్ బ్రిడ్జి - 32 మంది మృత్యువాత

Webdunia
ఆదివారం, 30 అక్టోబరు 2022 (22:11 IST)
గుజరాత్ రాష్ట్రంలో పెను విషాదం చోటుచేసుకుంది. మోర్బీ ప్రాంతంలో కేబుల్ వంతెన తెగిపోయింది. దీంతో 32 మంది మృత్యువాతపడ్డారు. మరో 400 మంది వరకు గాయపడ్డారు. వీరిలో 70 మందిని ప్రాణాపాయస్థితి నుంచి కాపాడారు. 
 
గుజరాత్ రాష్ట్రంలోని మచ్చూ నదిపై కేబుల్ బ్రిడ్జి ఎప్పటి నుంచో ఉండగా, ఐదు రోజుల క్రితమే ఈ కేబుల్ వంతెనకు ఆధునకీకరణ పనులుచేశారు. ఈ వంతెన దాటుతుండగా ఒక్కసారిగా తెగిపోయింది. 
 
ఆ సమయంలో వంతెనపై దాదాపు 500 మంది వరకు ఉన్నట్టు సమాచారం.  వంతెన కూలిపోగానే చాలా మంది నదిలో పడిపోయారు. వీరిలో ఈత తెలిసినవారు మాత్రం ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. అయినప్పటికీ 32 మంది చనిపోయారు. 
 
ప్రమాద వార్త తెలియగానే ప్రధాని మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో మాట్లాడి ఈ ఘటన వివరాలను తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. 
 
అంతేకాకుండా, ఈ ప్రమాదంలో చనిపోయిన వారి మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు, కేంద్రం రూ.2 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించాయి. గాయపడిన వారికి రూ.50 వేలు సాయాన్ని ప్రకటించాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments