Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్‌ మచ్చూ నదిపై తెగిన కేబుల్ బ్రిడ్జి - 32 మంది మృత్యువాత

Webdunia
ఆదివారం, 30 అక్టోబరు 2022 (22:11 IST)
గుజరాత్ రాష్ట్రంలో పెను విషాదం చోటుచేసుకుంది. మోర్బీ ప్రాంతంలో కేబుల్ వంతెన తెగిపోయింది. దీంతో 32 మంది మృత్యువాతపడ్డారు. మరో 400 మంది వరకు గాయపడ్డారు. వీరిలో 70 మందిని ప్రాణాపాయస్థితి నుంచి కాపాడారు. 
 
గుజరాత్ రాష్ట్రంలోని మచ్చూ నదిపై కేబుల్ బ్రిడ్జి ఎప్పటి నుంచో ఉండగా, ఐదు రోజుల క్రితమే ఈ కేబుల్ వంతెనకు ఆధునకీకరణ పనులుచేశారు. ఈ వంతెన దాటుతుండగా ఒక్కసారిగా తెగిపోయింది. 
 
ఆ సమయంలో వంతెనపై దాదాపు 500 మంది వరకు ఉన్నట్టు సమాచారం.  వంతెన కూలిపోగానే చాలా మంది నదిలో పడిపోయారు. వీరిలో ఈత తెలిసినవారు మాత్రం ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. అయినప్పటికీ 32 మంది చనిపోయారు. 
 
ప్రమాద వార్త తెలియగానే ప్రధాని మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో మాట్లాడి ఈ ఘటన వివరాలను తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. 
 
అంతేకాకుండా, ఈ ప్రమాదంలో చనిపోయిన వారి మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు, కేంద్రం రూ.2 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించాయి. గాయపడిన వారికి రూ.50 వేలు సాయాన్ని ప్రకటించాయి. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments