Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్‌ మచ్చూ నదిపై తెగిన కేబుల్ బ్రిడ్జి - 32 మంది మృత్యువాత

Webdunia
ఆదివారం, 30 అక్టోబరు 2022 (22:11 IST)
గుజరాత్ రాష్ట్రంలో పెను విషాదం చోటుచేసుకుంది. మోర్బీ ప్రాంతంలో కేబుల్ వంతెన తెగిపోయింది. దీంతో 32 మంది మృత్యువాతపడ్డారు. మరో 400 మంది వరకు గాయపడ్డారు. వీరిలో 70 మందిని ప్రాణాపాయస్థితి నుంచి కాపాడారు. 
 
గుజరాత్ రాష్ట్రంలోని మచ్చూ నదిపై కేబుల్ బ్రిడ్జి ఎప్పటి నుంచో ఉండగా, ఐదు రోజుల క్రితమే ఈ కేబుల్ వంతెనకు ఆధునకీకరణ పనులుచేశారు. ఈ వంతెన దాటుతుండగా ఒక్కసారిగా తెగిపోయింది. 
 
ఆ సమయంలో వంతెనపై దాదాపు 500 మంది వరకు ఉన్నట్టు సమాచారం.  వంతెన కూలిపోగానే చాలా మంది నదిలో పడిపోయారు. వీరిలో ఈత తెలిసినవారు మాత్రం ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. అయినప్పటికీ 32 మంది చనిపోయారు. 
 
ప్రమాద వార్త తెలియగానే ప్రధాని మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో మాట్లాడి ఈ ఘటన వివరాలను తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. 
 
అంతేకాకుండా, ఈ ప్రమాదంలో చనిపోయిన వారి మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు, కేంద్రం రూ.2 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించాయి. గాయపడిన వారికి రూ.50 వేలు సాయాన్ని ప్రకటించాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments