Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు.. ఎరువులపై రాయితీ

Webdunia
గురువారం, 17 జూన్ 2021 (11:52 IST)
రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. డీఏపీ ఎరువులపై కేంద్ర ప్రభుత్వం బస్తాకు రూ.700 రాయితీని పెంచింది. వ్యవసాయంలో అధిక శాతం వాడే డై అమ్మోనియా ఫాస్పేట్‌ డీఏపీపై పెంపునకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో ప్రభుత్వంపై రూ.14,775 కోట్ల అదనపు భారం పడనుందని కేంద్ర మంత్రి మన్సుఖ్‌ మాండవియా తెలిపారు. గత నెల ప్రధాని మోడీ డీఏపీపై 140 శాతం రాయితీని పెంచాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో నిర్వహించిన తాజా మంత్రివర్గ సమావేశంలో యూరియాపై రూ. 500 నుంచి రూ.1200 పెంచింది.
 
దీనివల్ల ఇప్పటి వరకు రూ.2400కు లభించిన డీపీఏ ఇక నుంచి రూ.1200 కే రైతులకు అందుబాటులో ఉండనుంది. డీఏపీ వల్ల రైతులకు ఎక్కువ మారిందని గ్రహించిన కేంద్రం రాబోవు ఖరీఫ్‌ సీజన్‌ వరకు గరిష్టంగా డీఏపీ రీటైల్‌ ధరలను గత సంవత్సరం ధరల మాదిరి అందుబాటులో పెట్టనుంది. 
 
కొన్ని కంపెనీలు డీఏపీ ధరలను పెంచినా.. కేంద్రం ఆ ధరలను తగ్గించి రైతులకు అందుబాటులోకి తేనుంది. కోవిడ్‌ ప్యాకేజీలో భాగంగానే రైతులపై భారం తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. కొన్ని నెలల్లో అంతర్జాతీయంగా వ్యవసాయ, వ్యవసాయేతర వస్తువుల ధరలు తగ్గుముఖం పడతాయి, అప్పుడు ధరలను మరోసారి నిర్ణయిస్తామని తెలిపింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments