Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్.పి.ఆర్. చేపట్టాలి... అక్రమ విదేశీయుల లెక్క తేలుతుంది : రజినీకాంత్

Webdunia
బుధవారం, 5 ఫిబ్రవరి 2020 (14:25 IST)
దేశంలో ఉన్న అక్రమ విదేశీయుల లెక్కలు తేల్చాలంటే తక్షణం జాతీయ జనాభా పట్టికను చేపట్టాలని తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ అన్నారు. పైగా, జాతీయ పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వల్ల దేశంలోని ఏ ఒక్క ముస్లింకు నష్టం జరగదన్నారు. ఒక వేళ్ళ ఏదైనా నష్టం జరిగితే వారి తరపున పోరాడేందుకు తానే మొదటి వ్యక్తిని అవుతానని చెప్పారు. 
 
దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న‌కు దారితీస్తున్న పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టంపై ఆయన స్పందిస్తూ, పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టంతో ఎవ‌రికీ ఇబ్బంది ఉండ‌ద‌న్నారు. దేశ పౌరుల‌పై సీఏఏ ప్ర‌భావం ప‌డ‌ద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఒక‌వేళ సీఏఏ వ‌ల్ల ముస్లింల‌కు న‌ష్టం జ‌రిగితే, వారి త‌ర‌పున పోరాడేందుకు తానే మొద‌టి వ్య‌క్తిని అవుతాన‌న్నారు. 
 
జాతీయ జ‌నాభా ప‌ట్టిక‌(ఎన్‌పీఆర్‌) వ‌ల్ల దేశంలో ఉన్న అక్ర‌మ విదేశీయుల లెక్క తెలుస్తుంద‌న్నారు. జాతీయ పౌర జాబితాపైన కూడా సూప‌ర్ స్టార్ స్పందించారు. ఎన్సార్సీ అమ‌లుపై ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణ‌యం తీసుకోలేద‌న్నారు. 
 
జాతీయ పౌర జాబితా (ఎన్నార్సీ)ని దేశవ్యాప్తంగా అమలు చేయడంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని మంగ‌ళ‌వారం కేంద్రం స్పష్టం చేసిన విషయం తెల్సిందే. అదేవిధంగా జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్‌) కోసం వివరాలు సేకరించే సమయంలో పౌరుల నుంటి ఎటువంటి పత్రాలు కోరబోమన్నారు. 

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments