వచ్చే 2050నాటికల్లా ప్రపంచంలో ముస్లింల జనాభా అత్యధికంగా ఉండే దేశంగా భారత ఆవిర్భవించనున్నది. అప్పటికి వారి సంఖ్య 30 కోట్లు దాటవచ్చని అమెరికన్ మేధో పరిశోధనా సంస్థ ‘ప్యూ రిసెర్చి సెంటర్ వెల్లడించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చూస్తే క్రైస్తవం అతిపెద
వచ్చే 2050నాటికల్లా ప్రపంచంలో ముస్లింల జనాభా అత్యధికంగా ఉండే దేశంగా భారత ఆవిర్భవించనున్నది. అప్పటికి వారి సంఖ్య 30 కోట్లు దాటవచ్చని అమెరికన్ మేధో పరిశోధనా సంస్థ ‘ప్యూ రిసెర్చి సెంటర్ వెల్లడించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చూస్తే క్రైస్తవం అతిపెద్ద మతం కాగా, రెండవ స్థానంలో ఇస్లాం ఉంది. అయితే ఇస్లాం అత్యంత వేగంగా వ్యాప్తిచెందుతుండడంతో.... ఈ పెరుగుదల రేటు ఇలాగే కొనసాగితే ఈ శతాబ్దం ముగింపుకల్లా ముస్లింల సంఖ్య క్రైస్తవుల సంఖ్యను మించిపోతుందని ప్యూ రిసెర్చి సెంటర్ లెక్కగట్టింది.
ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక ముస్లిం జనాభా ఉన్న దేశం ఇండోనేసియా. ఇక ప్రపంచవ్యాప్తంగా ముస్లింల జనాభా 73 శాతం మేర పెరిగి 2050 నాటికల్లా 280 కోట్లకు చేరవచ్చని ప్యూ రిసెర్చి సెంటర్ అంచనా వేసింది. మొత్తానికి ప్రపంచ జనాభా పెరుగుదల రేటు కన్నా రెట్టింపు వేగంతో ముస్లింల జనాభా గ్రూపు మాత్రమే వృద్ధి చెందుతోందని ఈ అధ్యయనంలో తేలింది. అలాగే.. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలలో 62 శాతం ఆసియా పసిఫిక్ ప్రాంతంలోనే ఉంటున్నారు.
ముస్లిం జనాభాలో ఇంత వృద్ధి ఎలా సాధ్యమైంది అంటే ప్రపంచంలోని అన్ని మత బృందాల కంటే అత్యంత యువ వయస్కులు ముస్లింలలోనే ఉన్నారు. క్రిైస్తవమతం తర్వాత ప్రపంచంలో రెండో అతి పెద్ద మతంగా ఇస్లాం మతం గుర్తింపు పొందింది. ఇది అప్పుడు అతివేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన మతం. జనాభా వృద్ధి ఇలాగే కొనసాగితే 21వ శతాబ్దం చివరి నాటికి ప్రపంచ ముస్లిం జనాభా, ప్రపంచ క్రిస్టియన్ జనాభాను అధిగమిస్తుందని అమెరికన్ మేధో పరిశోదనా సంస్థ అంచనా వేసింది.
2010 నాటికి ప్రపంచంలో ముస్లింల సంఖ్య 160 కోట్లు. వచ్చే దశాబ్దాలలో ముస్లింల జనాభా 35 శాతం వృద్ధి చెందగలదని భావిస్తున్నారు. 20150 నాటికి ముస్లింల సంఖ్య 73 శాతం వృద్ధితో 280 కోట్లకు చేరుకోగలదు. వాస్తవానికి ప్రపంచ జనాభా వృద్ధి కంటే వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన మతం ఇస్లాం కావడం విశేషం. ముస్లింలలో మెజారిటీ అంటే 62 శాతం మంది ప్రస్తుతం ఆసియా-ఫసిపిక్ ప్రాంతంలోనే ఉన్నారు. అంటే ఈ ప్రాంతంలోనే ఇండోనేషియా, ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇరాన్, టర్కీ దేశాల్లోనే వీరు ఎక్కువగా ఉన్నారు.
ప్రస్తుతానికి ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో ముస్లింలను కలిగి ఉన్న దేశం ఇండోనేషియా. అయితే 2050 నాటికి 30 కోట్లమంది ముస్లిం జనాభాతో భారత్ ఆ స్థానాన్ని ఆక్రమించనుందని అమెరికన్ మేధో పరిశోధనా సంస్థ పేర్కొంది. అయితే అెమెరికాలో నేటికీ అతి కొద్ది సంఖ్యలో మాత్రమే ముస్లింలు ఉంటున్నందును అమెరికా సమాజంలో వారి పాత్ర చాలా తక్కువని ఈ సంస్థ పేర్కొంది.