Webdunia - Bharat's app for daily news and videos

Install App

డెబిట్‌ కార్డుదారులకు ఎస్‌బిఐ బంప‌ర్ ఆఫ‌ర్‌

Webdunia
మంగళవారం, 8 అక్టోబరు 2019 (14:11 IST)
దేశంలోని అతిపెద్ద బ్యాంకింగ్‌ సంస్థ భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బిఐ) డెబిట్‌ (ఏటిఎం)కార్డు కలిగిన వినియోగదారులకు తీపికబురును అందించింది.

తమ బ్యాంక్‌ డెబిట్‌ కార్డు కలిగి ఉన్న వారికి నెల వాయిదా చెల్లింపు (ఇఎంఐ) విధానంలో రుణ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తున్నట్టు ఎస్‌బిఐ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. 
 
దేశవ్యాప్తంగా 40,000కుపైగా వాణిజ్య సముదాయాలు, వ్యాపార సంస్ధల వద్ద ఏర్పాటు చేసిన పాయింట్‌ ఆఫ్‌ సేల్స్‌ (పిఒఎస్‌) వద్ద ఎస్‌బిఐ డెబిట్‌ కార్డుదారులు వస్తువులను కొనుగోలు చేసి నెల వాయిదాల రూపంలో చెల్లింపులు చేపట్టే వెసులుబాటు కల్పిస్తున్నామని ఎస్‌బిఐ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ వెల్లడించారు. 
 
వస్తువుల కొనుగోలుకు అయ్యే మొత్తం తక్షణమే ఒకేసారి చెల్లించకుండా డెబిట్‌ కార్డుల ద్వారా కస్టమర్లు ఇఎంఐపై వాటిని కొనుగోలు చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. కనిష్టంగా ఆరు నెలల నుంచి 18 నెలలుగా వినియోగదారులు ఈఎంఐ గడువును ఎంపిక చేసుకోవచ్చని ఎస్‌బిఐ పేర్కొంది. 
 
మెరుగైన క్రెడిట్‌ హిస్టరీ కలిగిన కస్టమర్లందరూ వినిమయ రుణాలను పొందవచ్చని ఎస్‌బిఐ ఈ ప్రకటన పేర్కొంది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments