Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి పత్రికలు పంచేందుకు వెళుతూ తిరిగిరాని లోకాలకు పెళ్ళికొడుకు

కర్నాటక రాష్ట్రంలోని హోసూరులో ఓ విషాదకర ఘటన ఒకటి చోటుచేసుకుంది. మరో నాలుగు రోజుల్లో జరగాల్సిన పెళ్లికి.. పెళ్లి పత్రికలు పంచేందుకు వెళుతుండగా మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పెళ్లి కొడుకు దుర్మరణ

Webdunia
సోమవారం, 24 అక్టోబరు 2016 (12:41 IST)
కర్నాటక రాష్ట్రంలోని హోసూరులో ఓ విషాదకర ఘటన ఒకటి చోటుచేసుకుంది. మరో నాలుగు రోజుల్లో జరగాల్సిన పెళ్లికి.. పెళ్లి పత్రికలు పంచేందుకు వెళుతుండగా మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పెళ్లి కొడుకు దుర్మరణం పాలయ్యాడు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
హోసూరుకు సమీపంలోని కుంబళం గ్రామానికి చెందిన రైతు మంజు (25) అనే యువకుడికి ఆంధ్రప్రదేశ్‌‌లోని మంచునాయకనపల్లి గ్రామానికి చెందిన సుధ(19)తో వివాహం నిశ్చయమైంది. మంజు ఆదివారం ఉదయం పెళ్ళిపత్రికలను తన స్నేహితులకు, బంధువులకు అందజేసేందుకు తమ ఊరినుంచి శూలగిరివైపు ద్విచక్రవాహనంలో బయలుదేరాడు. 
 
ఆ సమయంలో ఎదురుగా వచ్చిన కారు వేగంగా ఇతని వాహనాన్ని ఢీకొనడంతో తీవ్ర గాయాల పాలైన మంజు ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఇతన్ని ఢీకొన్న కారు ఆగకుండా వెళ్ళిపోయింది. సమాచారం తెలిసిన శూలగిరి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని శవాన్ని స్వాదీనం చేసుకుని శవపరీక్ష నిమిత్తం కృష్ణగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పరారైన కారు డ్రైవర్‌ కోసం గాలిస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mrunal Thakur: ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవుతున్న మృణాల్ ఠాకూర్ పేరు.. ఎలాగంటే?

పగ, అసూయ, ప్రేమ కోణాలను చూపించే ప్రభుత్వం సారాయి దుకాణం

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 కొత్త సీజన్ : కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏంటవి?

Pawan: ఎన్టీఆర్, ఎంజీఆర్ ప్రేరణతో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించా: జ్యోతి కృష్ణ

సయారా తో ఆడియెన్స్ ఆషికి రోజుల్ని తలుచుకుంటున్నారు : మహేష్ భట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments