Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లికి కొన్ని గంటలే.. ఇంతలో వరుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు.. ఎలా?

పెళ్లికి కొన్ని గంటలే మిగిలి వున్నాయి. వరుడు డీసీఎంలో పెళ్ళి మండపానికి బయల్దేరాడు. కానీ ఇంతలోనే లారీ రూపంలో వరుడిని తీసుకెళ్లేందుకు యముడు వెంటనే వచ్చేశాడు. ఫలితంగా రోడ్డు ప్రమాదంలో వరుడు కన్నుమూశాడు.

Webdunia
బుధవారం, 17 మే 2017 (11:16 IST)
పెళ్లికి కొన్ని గంటలే మిగిలి వున్నాయి. వరుడు డీసీఎంలో పెళ్ళి మండపానికి బయల్దేరాడు. కానీ ఇంతలోనే లారీ రూపంలో వరుడిని తీసుకెళ్లేందుకు యముడు వెంటనే వచ్చేశాడు. ఫలితంగా రోడ్డు ప్రమాదంలో వరుడు కన్నుమూశాడు.

బుధవారం (నేటి) రాత్రి పెళ్లి జరగనుండడంతో మంగళవారం అర్థరాత్రి దాటాక పెళ్లి బృందం డీసీఎంలో ఖమ్మం బయలుదేరింది. బుధవారం తెల్లవారుజామున ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనతో ఇరు కుటుంబాల్లో విషాదం అలముకుంది.
 
ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన వరుడు సహా కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి ఖమ్మం జిల్లా చర్ల మండలంలోని వధువు ఇంటికి డీసీఎంలో బయలుదేరారు. 
 
మార్గమధ్యంలో మోతె గ్రామం వద్ద ఓ పెట్రోలు బంకు సమీపంలో డీసీఎంను ఆపగా, వెనకనుంచి వేగంగా వచ్చిన లారీ డీసీఎంను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వరుడు వెంకటశేషసాయి (21), దామోదర్ (35) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో పదిమంది గాయపడ్డారు. వీరిని కోదాడ ఆస్పత్రికి తరలించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments