Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లికి కొన్ని గంటలే.. ఇంతలో వరుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు.. ఎలా?

పెళ్లికి కొన్ని గంటలే మిగిలి వున్నాయి. వరుడు డీసీఎంలో పెళ్ళి మండపానికి బయల్దేరాడు. కానీ ఇంతలోనే లారీ రూపంలో వరుడిని తీసుకెళ్లేందుకు యముడు వెంటనే వచ్చేశాడు. ఫలితంగా రోడ్డు ప్రమాదంలో వరుడు కన్నుమూశాడు.

Webdunia
బుధవారం, 17 మే 2017 (11:16 IST)
పెళ్లికి కొన్ని గంటలే మిగిలి వున్నాయి. వరుడు డీసీఎంలో పెళ్ళి మండపానికి బయల్దేరాడు. కానీ ఇంతలోనే లారీ రూపంలో వరుడిని తీసుకెళ్లేందుకు యముడు వెంటనే వచ్చేశాడు. ఫలితంగా రోడ్డు ప్రమాదంలో వరుడు కన్నుమూశాడు.

బుధవారం (నేటి) రాత్రి పెళ్లి జరగనుండడంతో మంగళవారం అర్థరాత్రి దాటాక పెళ్లి బృందం డీసీఎంలో ఖమ్మం బయలుదేరింది. బుధవారం తెల్లవారుజామున ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనతో ఇరు కుటుంబాల్లో విషాదం అలముకుంది.
 
ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన వరుడు సహా కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి ఖమ్మం జిల్లా చర్ల మండలంలోని వధువు ఇంటికి డీసీఎంలో బయలుదేరారు. 
 
మార్గమధ్యంలో మోతె గ్రామం వద్ద ఓ పెట్రోలు బంకు సమీపంలో డీసీఎంను ఆపగా, వెనకనుంచి వేగంగా వచ్చిన లారీ డీసీఎంను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వరుడు వెంకటశేషసాయి (21), దామోదర్ (35) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో పదిమంది గాయపడ్డారు. వీరిని కోదాడ ఆస్పత్రికి తరలించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments