అప్పగింతలు.. అతిగా ఏడ్చిన వధువు.. గుండెపోటుతో మృతి

Webdunia
శనివారం, 6 మార్చి 2021 (11:55 IST)
పెళ్లి వైభవంగా ముగిసింది. కానీ అప్పగింతలే ఆ వధువుకు ప్రాణాల మీదకు తెచ్చింది. పెళ్ళి చేసుకున్న అనంతరం వరుడు కుటుంబానికి వధువును తల్లిదండ్రులు అప్పగిస్తారు. ఆ సమయంలో వధువు కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతుంటారు. తమ కుమార్తెకు ఎలాంటి కష్టం రానీయకుండా చూసుకోవాలని, ఏదైనా తప్పులు జరిగితే సర్దుకు పోవాలంటూ.. అప్పగిస్తుంటారు. 
 
ఇక సున్నితమైన మనస్కులు వారైతే.. ఏడుస్తూ…కుప్పకూలిపోతుంటారు. ఇలాగే ఓ ఘటన ఒకటి చోటుచేసుకుంది. అత్తారింటికి వెళ్లే సమయంలో.. అతిగా ఏడుస్తూ.. వధువు మృతి చెందింది. ఈ ఘటన ఒడిసా రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సోనేపూర్ జిల్లాలో గుప్తేశ్వరి సాహూకు ఓ యువకుడి తో వివాహం జరిగింది. మరుసటి రోజు..అత్తారింటికి పంపేందుకు ఏర్పాట్లు చేశారు. 
 
నవ వధువుకు వీడ్కోలు పలుకుతుండగా ఒక్కసారిగా ఆమె సృహ కోల్పోయింది. వెంటనే కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. పరీక్షలు జరపగా..ఆమె చనిపోయిందని నిర్ధారించారు. అప్పగింతల్లో అతిగా ఏడ్వడం వల్ల గుండెపోటు వచ్చిందని, దీంతో వధువు చనిపోయినట్లు పేర్కొన్నారు.
 
నీరసం వల్లే సృహ కోల్పోయిందని భావించామని..ఇంత ఘోరం జరుగుతుందని అనుకోలేదని వధువు కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: యుద్దం నేపథ్యంలో శంబాల ట్రైలర్‌.. ఆవిష్కరించిన ప్రభాస్

Allari Naresh: ప్రేమ, థ్రిల్ ఎలిమెంట్స్ తో అల్లరి నరేష్ 12A రైల్వే కాలనీ

Bhagyashree Borse: నక్షత్రాల మధ్య ఆటలాడుతూ, వెన్నెల్లో తేలియాడుతూ.. రామ్, భాగ్యశ్రీ బోర్సే

Mass Jatara Review: జరుగుతున్న కథతో ఫ్యాన్స్ ఫార్ములాగా మాస్ జాతర - మూవీ రివ్యూ

Allu Sirish and Nayanika: నయనిక రెడ్డితో అల్లు శిరీష్.. తారల సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments