Webdunia - Bharat's app for daily news and videos

Install App

దోషిగా డేరా బాబా... మరో నలుగురిని కూడా దోషులుగా తేల్చిన కోర్టు

Webdunia
శుక్రవారం, 8 అక్టోబరు 2021 (13:27 IST)
డేరా బాబా అలియాస్.. గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌తో పాటు మరో నలుగురిని ఓ హత్య కేసులో దోషులుగా హరియాణాలోని సీబీఐ ప్రత్యేక కోర్టు తేల్చింది. అక్టోబర్ 12న వారికి శిక్ష ఖరారు చేయనున్నట్టు తెలిపింది. 
 
వివరాల్లోకెళ్తే.. 2002లో రంజిత్ సింగ్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ కేసును 2003లో సీబీఐకి అప్పగించారు. దాంతో ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 
 
ఈ మేరకు విచారణ చేపట్టిన కోర్టు.. రామ్ రహీమ్ సింగ్ తో పాటు క్రిష్ణలాల్, జస్వీర్, సబ్దిల్, అవతార్ లను దోషులుగా తేల్చింది. అయితే నిందితుల్లో ఒకరు ఇప్పటికే మరణించారు. ఇక జర్నలిస్ట్ రామచంద్ర ఛత్రపతి హత్య సహా మహిళా అనుచరులపై లైంగికదాడి కేసులో ఇప్పటికే డేరా బాబా శిక్ష అనుభవిస్తూ సునారియా జైలులో ఉన్నారు. 
 
గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ తన ఆశ్రమంలో తన ఇద్దరు మహిళా శిష్యులపై అత్యాచారం చేసినందుకు 20 సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. 2017 ఆగస్టులో పంచకుల ప్రత్యేక సీబీఐ కోర్టు అతడిని దోషిగా నిర్ధారించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ వయసు 70 - త్రిష వయసు 42 యేళ్ళు.. 'థగ్‌లైఫ్' కోసం రొమాన్స్!!

థ్యాంక్యూ పవన్ జీ.. మీ ఆలోచనలతో ఏకీభవిస్తున్నాను.. దిల్ రాజు

హైదరాబాద్, చెన్నైలలో షూటింగ్ కు సిద్ధమైన పూరీ, విజయ్ సేతుపతి సినిమా

జే.డి. లక్ష్మీ నారాయణ లాంచ్ చేసిన కృష్ణ లీల సెకండ్ సింగిల్

కమల్ హాసన్, శింబు, మణిరత్నం థగ్ లైఫ్ నుంచి ఓ మార సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

Vitamin C Serum: మహిళల చర్మ సౌందర్యానికి వన్నె తెచ్చే విటమిన్ సి సీరం..

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments