Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాగునీటి కోసం నదివద్దకు వెళ్లిన బాలుడు.. మొసలి నోటికి ఎర

Webdunia
సోమవారం, 22 మే 2023 (11:04 IST)
కర్నాటక రాష్ట్రంలో ఓ విషాదకర ఘటన జరిగింది. తాగునీటి కోసం నది వద్దకు వెళ్లిన ఓ బాలుడు అదృశ్యమయ్యాడు. ఆ బాలుడిపై మొసలి దాడి చేసి నోట కరుచుకుని నదిలోకి వెళ్లిపోయింది. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలోని రాయచూరు తాలూకాలోని కృష్ణానదిలో జరిగింది. మృతుడిని ఈ తాలూకాలోని నడిగడ్డు గ్రామమైన కొర్వకులకు చెందిన బాలుడుగా గుర్తించారు.

నవీన్ (9) అనే బాలుడు ఆదివారం తన తల్లిదండ్రులతో కలిసి నదీ తీరంలో ఉన్న పొలం వద్దకెళ్లాడు. తాగునీటి కోసం మరో బాలుడితో కలిసి నదిలోకి వెళ్లి బాటిల్‌లో నీరు నింపుకొంటుండగా మొసలి.. నవీన్‌ను నోట కరచుకుని వెళ్లింది. ఈ భయానక దృశ్యాన్ని చూసిన మరో బాలుడు రోదిస్తూ విషయాన్ని పెద్దలకు చెప్పాడు.

గ్రామస్థులు నది వద్దకెళ్లి చూడగా నవీన్ జాడ కనిపించలేదు. సమాచారం అందుకున్న పోలీసులు.. అగ్నిమాపక సిబ్బందితో కలిసి బాలుడి ఆచూకీ కోసం గాలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. రాత్రి వరకు బాలుడి జాడ కానరాలేదు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments