Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాగునీటి కోసం నదివద్దకు వెళ్లిన బాలుడు.. మొసలి నోటికి ఎర

Webdunia
సోమవారం, 22 మే 2023 (11:04 IST)
కర్నాటక రాష్ట్రంలో ఓ విషాదకర ఘటన జరిగింది. తాగునీటి కోసం నది వద్దకు వెళ్లిన ఓ బాలుడు అదృశ్యమయ్యాడు. ఆ బాలుడిపై మొసలి దాడి చేసి నోట కరుచుకుని నదిలోకి వెళ్లిపోయింది. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలోని రాయచూరు తాలూకాలోని కృష్ణానదిలో జరిగింది. మృతుడిని ఈ తాలూకాలోని నడిగడ్డు గ్రామమైన కొర్వకులకు చెందిన బాలుడుగా గుర్తించారు.

నవీన్ (9) అనే బాలుడు ఆదివారం తన తల్లిదండ్రులతో కలిసి నదీ తీరంలో ఉన్న పొలం వద్దకెళ్లాడు. తాగునీటి కోసం మరో బాలుడితో కలిసి నదిలోకి వెళ్లి బాటిల్‌లో నీరు నింపుకొంటుండగా మొసలి.. నవీన్‌ను నోట కరచుకుని వెళ్లింది. ఈ భయానక దృశ్యాన్ని చూసిన మరో బాలుడు రోదిస్తూ విషయాన్ని పెద్దలకు చెప్పాడు.

గ్రామస్థులు నది వద్దకెళ్లి చూడగా నవీన్ జాడ కనిపించలేదు. సమాచారం అందుకున్న పోలీసులు.. అగ్నిమాపక సిబ్బందితో కలిసి బాలుడి ఆచూకీ కోసం గాలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. రాత్రి వరకు బాలుడి జాడ కానరాలేదు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mirai: కూలిపోతున్న వంతెన మీద స్టిక్ తో మిరాయ్ లో తేజ లుక్

ఎమోషనల్‌గా కట్టి పడేసే బ్యూటీ టీజర్... సెప్టెంబర్ రిలీజ్

Haivan: ప్రియదర్శన్, అక్షయ్ ఖన్నా, సైఫ్ అలీఖాన్ కాంబినేషన్ లో హైవాన్ ప్రారంభమైంది

వార్ 2 పంపిణీతో బాగా నష్టపోయిన నాగ వంశీ, క్షమించండి అంటూ పోస్ట్

Samantha: వెండితెరపై కనిపించి రెండేళ్లైంది.. మా ఇంటి బంగారంగా వస్తానుగా అంటోన్న సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments