Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యప్రదేశ్‌లో దయనీయస్థితి ... తోపుడు బండిపై తండ్రిని ఆస్పత్రికి తరలించిన బాలుడు

Webdunia
ఆదివారం, 12 ఫిబ్రవరి 2023 (11:05 IST)
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒకటైన మధ్యప్రదేశ్‌లో వైద్య సదుపాయాలు మరింత అధ్వాన్నంగా ఉన్నాయని చెప్పడానికి ఈ దృశ్యం చాలు. అనారోగ్యంతో బాధడుతున్న తన తండ్రిని ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్‌కు ఫోన్ చేస్తే వారి వైపు నుంచి సరైన స్పందన లేదు. దీంతో తన తండ్రిని ఆస్పత్రికి తరలించేందుకు ఆరేళ్ళ బాలుడు తోపుడు బండిపై పడుకోబెట్టి తోసుకెళ్లారు.
 
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సింగ్రౌలీలో చోటుచేసుకున్న ఈ ఘటన నెటిజన్లను కంటతడిపెట్టిస్తుంది. ఈ ఘటన ను అక్కడున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. సింగ్రౌలీకి చెందిన షా కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఇటీవల అనారోగ్యం ఎక్కువకావడంతో షాను ప్రభుత్వం ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఆయన భార్య, ఆరేళ్ల కొడుకు ప్రయత్నించారు. 
 
అంబులెన్స్ కోసం ఆస్పత్రికి ఫోన్ చేయగా, అటువైపు నుంచి స్పందన లేదు. నిరుపేద కుటుంబం కావడంతో ఆటోలో తీసుకెళ్లేంత సొమ్ము లేదు. ఏం చేయాలో తోచక చివరకు తోపుడు బండిపై షాను ఆస్పత్రికి తీసుకెళ్లాలని తల్లీకొడుకులు నిర్ణయించారు. ఇద్దరూ కలిసి షా ను తోపుడు బండిపై చేర్చారు. ఆ పై బండిని మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments