Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యప్రదేశ్‌లో దయనీయస్థితి ... తోపుడు బండిపై తండ్రిని ఆస్పత్రికి తరలించిన బాలుడు

Webdunia
ఆదివారం, 12 ఫిబ్రవరి 2023 (11:05 IST)
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒకటైన మధ్యప్రదేశ్‌లో వైద్య సదుపాయాలు మరింత అధ్వాన్నంగా ఉన్నాయని చెప్పడానికి ఈ దృశ్యం చాలు. అనారోగ్యంతో బాధడుతున్న తన తండ్రిని ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్‌కు ఫోన్ చేస్తే వారి వైపు నుంచి సరైన స్పందన లేదు. దీంతో తన తండ్రిని ఆస్పత్రికి తరలించేందుకు ఆరేళ్ళ బాలుడు తోపుడు బండిపై పడుకోబెట్టి తోసుకెళ్లారు.
 
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సింగ్రౌలీలో చోటుచేసుకున్న ఈ ఘటన నెటిజన్లను కంటతడిపెట్టిస్తుంది. ఈ ఘటన ను అక్కడున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. సింగ్రౌలీకి చెందిన షా కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఇటీవల అనారోగ్యం ఎక్కువకావడంతో షాను ప్రభుత్వం ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఆయన భార్య, ఆరేళ్ల కొడుకు ప్రయత్నించారు. 
 
అంబులెన్స్ కోసం ఆస్పత్రికి ఫోన్ చేయగా, అటువైపు నుంచి స్పందన లేదు. నిరుపేద కుటుంబం కావడంతో ఆటోలో తీసుకెళ్లేంత సొమ్ము లేదు. ఏం చేయాలో తోచక చివరకు తోపుడు బండిపై షాను ఆస్పత్రికి తీసుకెళ్లాలని తల్లీకొడుకులు నిర్ణయించారు. ఇద్దరూ కలిసి షా ను తోపుడు బండిపై చేర్చారు. ఆ పై బండిని మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

తర్వాతి కథనం
Show comments