Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉన్నవో ఘటన.. పోలీస్ దెబ్బలకు 17 ఏళ్ల బాలుడు మృతి

Webdunia
శనివారం, 22 మే 2021 (10:20 IST)
ఉన్నవో జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పోలీసులు దెబ్బలకు 17 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. కరోనా నేపథ్యంలో... ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం మే 24 ఉదయం 7 గంటల వరకు రాష్ట్రంలో కరోనా కర్ఫ్యూను విధించింది. ఈ క్రమంలోఉన్నవో జిల్లాలోని 17 ఏళ్ల బాలుడు కర్ఫ్యూ నిబంధనలను అతిక్రమించాడంటూ.. అక్కడి ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు, హోంగార్డు కలిసి బాలుడిని తీవ్రంగా కొట్టారు. 
 
పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడి పరిస్థితి విషమించడంతో వెంటనే బాలుడిని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు శుక్రవారం మృతి చెందాడు. పోలీసు చర్యతో ఆగ్రహించిన కుటుంబీకులు, స్థానికులు లక్నో రోడ్‌ క్రాసింగ్‌ వద్ద రహదారిని దిగ్బంధం చేశారు. 
 
దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ నిరసన చేపట్టారు. మృతి చెందిన బాలుడి కుటుంబానికి పరిహారం చెల్లించాలని, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయం తెలిసిన పోలీసు ఉన్నతాధికారులు బాలుడి మృతికి కారణమయిన ఇద్దరు పోలీస్‌ కానిస్టేబుళ్లు, హోంగార్డును వెంటనే సస్పెండ్‌ చేశారని, ఘటనపై విచారణ చేపట్టారని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్ల బంద్ పై మంత్రి సీరియస్ - దిగి వచ్చిన తెలుగు ఫిలిం ఛాంబర్

Subhalekha Sudhakar: బాలు, షిన్నోవా నటించిన ఒక బృందావనం సినిమా సమీక్ష

Hebba patel: గోల్డ్ పర్చేజ్ భవిష్యత్ కు బంగారు భరోసా : హెబ్బా పటేల్

Manoj: మోహన్ బాబు ఇంటినుంచి భోజనం వచ్చేది, అమ్మవారి దయ వుంది : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

తెలుగు చిత్ర విలన్ కన్నుమూత - ప్రముఖుల సంతాపం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments