Webdunia - Bharat's app for daily news and videos

Install App

రక్షణ లేదన్నవారిపై బాంబులేస్తాం : బీజేపీ ఎమ్మెల్యే

Webdunia
శుక్రవారం, 4 జనవరి 2019 (16:17 IST)
ఒకవైపు దేశంలో ఉంటూనే మరోవైపు దేశాన్ని విమర్శిస్తూ, దేశంలో రక్షణ లేదనే వారిపై బాంబు లేస్తామని ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యే విక్రమ్ శైనీ హెచ్చరించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, దేశంలో ఉంటూ దేశంపై విమర్శలు గుప్పించేవారు దేశ ద్రోహులకిందకే వస్తారన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గోరక్ష పేరుతో ఇటీవల జరిగిన సంఘటనలు తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెల్సిందే. దీంతో భారత్‌లో రక్షణలేకుండా పోతోందంటూ కొందరు చేసిన విమర్శలపై ఆయన స్పందించారు. 
 
ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారందరూ దేశ ద్రోహులేనని అన్నారు. చట్టం ప్రకారం వీళ్లందరినీ కఠినంగా శిక్షించాలన్నారు. భారత్‌లో ఉండటం రక్షణాత్మకం కాదు అంటూ బెదిరింపు వ్యాఖ్యలు చేసేవారిపై బాంబులు వేయాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. భారతీయ విలువలను గౌరవించని వాళ్లు.. ఈ దేశం విడిచి విదేశాలకు వెళ్లడాన్ని మేం స్వాగతిస్తామన్నారు. 
 
ఇందుకోసం ఓ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తే భారత్‌లో ఉంటూ అభద్రతకు లోనవుతున్నవారిపై బాంబులేసే బాధ్యతను తాను తీసుకుంటానని ఎమ్మెల్యే విక్రమ్ శైనీ చెప్పడం ఇక్కడ కొసమెరుపు. పైగా, తాను ఎవరికీ భయపడనని.. దేశం కోసమే ఇలా మాట్లాడానని చెప్పారు. కాగా, ఈయన గతంలో హిందువులు సాధ్యమైనంతమేరకు ఎక్కువ మంది పిల్లల్ని కనాలంటూ పిలుపునిచ్చిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijayashanti: అర్జున్ S/O వైజయంతి తర్వాత విజయశాంతి సినిమాలు చేయదా?

Anasuya Bharadwaj: అరి చిత్రానికి కష్టాలు- రిలీజ్‌ ను ఆపుతుంది ఎవరు?

Tamannaah : ముంబైలో తమన్నా భాటియా ఓదెల 2 ట్రైలర్ లాంచ్ కాబోతోంది

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments