Webdunia - Bharat's app for daily news and videos

Install App

రక్షణ లేదన్నవారిపై బాంబులేస్తాం : బీజేపీ ఎమ్మెల్యే

Webdunia
శుక్రవారం, 4 జనవరి 2019 (16:17 IST)
ఒకవైపు దేశంలో ఉంటూనే మరోవైపు దేశాన్ని విమర్శిస్తూ, దేశంలో రక్షణ లేదనే వారిపై బాంబు లేస్తామని ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యే విక్రమ్ శైనీ హెచ్చరించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, దేశంలో ఉంటూ దేశంపై విమర్శలు గుప్పించేవారు దేశ ద్రోహులకిందకే వస్తారన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గోరక్ష పేరుతో ఇటీవల జరిగిన సంఘటనలు తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెల్సిందే. దీంతో భారత్‌లో రక్షణలేకుండా పోతోందంటూ కొందరు చేసిన విమర్శలపై ఆయన స్పందించారు. 
 
ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారందరూ దేశ ద్రోహులేనని అన్నారు. చట్టం ప్రకారం వీళ్లందరినీ కఠినంగా శిక్షించాలన్నారు. భారత్‌లో ఉండటం రక్షణాత్మకం కాదు అంటూ బెదిరింపు వ్యాఖ్యలు చేసేవారిపై బాంబులు వేయాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. భారతీయ విలువలను గౌరవించని వాళ్లు.. ఈ దేశం విడిచి విదేశాలకు వెళ్లడాన్ని మేం స్వాగతిస్తామన్నారు. 
 
ఇందుకోసం ఓ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తే భారత్‌లో ఉంటూ అభద్రతకు లోనవుతున్నవారిపై బాంబులేసే బాధ్యతను తాను తీసుకుంటానని ఎమ్మెల్యే విక్రమ్ శైనీ చెప్పడం ఇక్కడ కొసమెరుపు. పైగా, తాను ఎవరికీ భయపడనని.. దేశం కోసమే ఇలా మాట్లాడానని చెప్పారు. కాగా, ఈయన గతంలో హిందువులు సాధ్యమైనంతమేరకు ఎక్కువ మంది పిల్లల్ని కనాలంటూ పిలుపునిచ్చిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments