రక్షణ లేదన్నవారిపై బాంబులేస్తాం : బీజేపీ ఎమ్మెల్యే

Webdunia
శుక్రవారం, 4 జనవరి 2019 (16:17 IST)
ఒకవైపు దేశంలో ఉంటూనే మరోవైపు దేశాన్ని విమర్శిస్తూ, దేశంలో రక్షణ లేదనే వారిపై బాంబు లేస్తామని ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యే విక్రమ్ శైనీ హెచ్చరించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, దేశంలో ఉంటూ దేశంపై విమర్శలు గుప్పించేవారు దేశ ద్రోహులకిందకే వస్తారన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గోరక్ష పేరుతో ఇటీవల జరిగిన సంఘటనలు తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెల్సిందే. దీంతో భారత్‌లో రక్షణలేకుండా పోతోందంటూ కొందరు చేసిన విమర్శలపై ఆయన స్పందించారు. 
 
ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారందరూ దేశ ద్రోహులేనని అన్నారు. చట్టం ప్రకారం వీళ్లందరినీ కఠినంగా శిక్షించాలన్నారు. భారత్‌లో ఉండటం రక్షణాత్మకం కాదు అంటూ బెదిరింపు వ్యాఖ్యలు చేసేవారిపై బాంబులు వేయాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. భారతీయ విలువలను గౌరవించని వాళ్లు.. ఈ దేశం విడిచి విదేశాలకు వెళ్లడాన్ని మేం స్వాగతిస్తామన్నారు. 
 
ఇందుకోసం ఓ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తే భారత్‌లో ఉంటూ అభద్రతకు లోనవుతున్నవారిపై బాంబులేసే బాధ్యతను తాను తీసుకుంటానని ఎమ్మెల్యే విక్రమ్ శైనీ చెప్పడం ఇక్కడ కొసమెరుపు. పైగా, తాను ఎవరికీ భయపడనని.. దేశం కోసమే ఇలా మాట్లాడానని చెప్పారు. కాగా, ఈయన గతంలో హిందువులు సాధ్యమైనంతమేరకు ఎక్కువ మంది పిల్లల్ని కనాలంటూ పిలుపునిచ్చిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments