Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ ప్రియురాలి ఇంటికి బాంబు పార్శిల్ బాంబు - భర్త, కుమార్తె మృతి

ఠాగూర్
శుక్రవారం, 3 మే 2024 (17:56 IST)
తన మాజీ ప్రియురాలైన వివాహిత ఇంటికి ఆమె ప్రియుడు ఓ పార్శిల్ బాంబును పంపించాడు. ఈ బాంబు పేలడంతో ఆ మహిళ భర్త, కుమార్తె ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర ఘటన గుజరాత్ రాష్ట్రంలోని వడాలిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జీతూభాయ్ హీరాభాయ్ వంజారా(32) అనే వ్యక్తి కుటుంబంతో సహా వడాలిలో నివసిస్తూ కూలి పని చేసుకుంటూ జీవితం సాగిస్తున్నారు. గురువారం వారి ఇంటికి టేప్ రికార్డర్ వంటి పరికరం పార్సిల్‌ రావడంతో దానిని తీసుకున్న జీతూభాయ్, అతని కుమార్తె భూమిక(12) ఆన్‌ చేయడానికి ప్రయత్నించగా అది ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలిపోయింది. 
 
ఈ ప్రమాదంలో జీతూభాయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన భూమికను స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆమె కూడా మృతి చెందింది. మరో ఇద్దరు కుమార్తెలకు గాయాలవడంతో వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు అతడి భార్య ఇంట్లో లేకపోవడంపై పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.
 
సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా ఇంటికి ప్యాకేజీని డెలివరీ చేసిన రిక్షా డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వాంగ్మూలం ఆధారంగా నిందితుడు జయంతిభాయ్ బాలుసింగ్ వంజారా (31) ను అరెస్టు చేశామన్నారు. అతడు రాజస్థాన్‌కు వెళ్లి బాంబు తయారీకి అవసరమైన పదార్థాలు కొనుగోలు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. టేప్‌ రికార్డర్‌ ప్లగ్‌ ఆన్‌ చేసిన వెంటనే అది పేలేలా బాంబును రూపొందించాడని వారు పేర్కొన్నారు. తన ప్రియురాలిని జీతూభాయ్‌ వివాహం చేసుకున్నాడనే కారణంతోనే అతడిని హత్య చేయడానికి నిర్ణయించుకున్నానని నిందితుడు తెలిపాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments