మమతా కులకర్ణి. ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది కదూ. మీరు అనుకున్నది నిజమే. 90వ దశకంలో బాలీవుడ్లో అగ్రతారల్లో ఒకరిగా వెలుగొందింది. సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్ వంటి అగ్రనటుల సరసన కూడా నటించింది. ఇపుడు డ్రగ్స్ రాకెట్ కోరల్లో చిక్కుకొని ఉక్కిరిబిక్కిరవుతోంది. మాదకద్రవ్యాలను అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలతో మమతా కులకర్ణి భర్త వికీ గోస్వామిని కెన్యా పోలీసులు అరెస్టు చేశారు. అలాగే మమతా బెనర్జీని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ డ్రగ్స్ అక్రమ కేసులో మమతకు సంబంధం ఉందా లేదా అనే కోణంలో కెన్యా పోలీసులు విచారణ సాగిస్తున్నట్టు సమాచారం.
డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్న వికీ గోస్వామిని మమతా కులకర్ణి ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈయనకు ముంబైకు సమీపంలో మత్తు పదార్థాల తయారీ ఫ్యాక్టరీ వుంది. ఇక్కడ తయారయ్యే డ్రగ్స్ను నైరోబీ మీదుకా అమెరికాకు అక్రమ రవాణా చేస్తుంటారు. ఈ పరిస్థితుల్లో ముంబై- పూణె పోలీసులు ఈ ఫ్యాక్టరీపై ఇటీవల సోదాలు జరిపి మొత్తం 20 వేల కేజీల డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.2 వేల కోట్లు ఉంటుందని అంచనా. ఈ నేపథ్యంలో ఈ దంపతులిద్దరినీ కెన్యా పోలీసులు అరెస్టు చేశారు.