Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలోని ఇజ్రాయెల్ దౌత్యకార్యాలయం వద్ద పేలుడు

Webdunia
శుక్రవారం, 29 జనవరి 2021 (18:54 IST)
ఢిల్లీలోని ఇజ్రాయెల్ దౌత్యకార్యాలయం వద్ద శుక్రవారం సాయంత్రం పేలుడు సంభవించింది. ఎంబసీ భవనం ఉన్న పేవ్‌మెంట్‌పై ఈ పేలుడు జరిగినట్టు వెల్లడించారు. ఈ పేలుడు కారణంగా అక్కడ పార్క్ చేసున్న నాలుగు కార్ల అద్దాలు పగిలిపోయాయి.
 
అయితే ఈ పేలుడులో ఎవరూ గాయపడలేదు. అదేసమయంలో పేలుడు వార్త తెలుసుకున్న వెంటనే ఆ ప్రాంతంలో భారీ ఎత్తున పోలీసు బలగాలను మొహరించారు. ముఖ్యంగా, అబ్దుల్ కలాం రోడ్డు మొత్తం పోలీసుల వలయంలోకి వెళ్లిపోయింది. ఐఈడీ (పేలుడు పదార్థాలు) ఉన్న బ్యాగును పేవ్‌మెంట్‌పై ఉంచి దుండగులు వెళ్లిపోయారని పోలీసులు తెలిపారు. 
 
పేలుడు సంభవించిన ప్రాంతం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ, ఇతర ప్రముఖులు పాల్గొంటున్న 'బీటింగ్ ది రిట్రీట్ సెరమొనీ' జరుగుతున్న ప్రాంతానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. పేలుడు నేపథ్యంలో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. ఢిల్లీ నగర వ్యాప్తంగా భద్రతా బలగాలతో పాటు పోలీసులను అప్రమత్తం చేశారు. అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుంటున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments