Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలోని ఇజ్రాయెల్ దౌత్యకార్యాలయం వద్ద పేలుడు

Webdunia
శుక్రవారం, 29 జనవరి 2021 (18:54 IST)
ఢిల్లీలోని ఇజ్రాయెల్ దౌత్యకార్యాలయం వద్ద శుక్రవారం సాయంత్రం పేలుడు సంభవించింది. ఎంబసీ భవనం ఉన్న పేవ్‌మెంట్‌పై ఈ పేలుడు జరిగినట్టు వెల్లడించారు. ఈ పేలుడు కారణంగా అక్కడ పార్క్ చేసున్న నాలుగు కార్ల అద్దాలు పగిలిపోయాయి.
 
అయితే ఈ పేలుడులో ఎవరూ గాయపడలేదు. అదేసమయంలో పేలుడు వార్త తెలుసుకున్న వెంటనే ఆ ప్రాంతంలో భారీ ఎత్తున పోలీసు బలగాలను మొహరించారు. ముఖ్యంగా, అబ్దుల్ కలాం రోడ్డు మొత్తం పోలీసుల వలయంలోకి వెళ్లిపోయింది. ఐఈడీ (పేలుడు పదార్థాలు) ఉన్న బ్యాగును పేవ్‌మెంట్‌పై ఉంచి దుండగులు వెళ్లిపోయారని పోలీసులు తెలిపారు. 
 
పేలుడు సంభవించిన ప్రాంతం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ, ఇతర ప్రముఖులు పాల్గొంటున్న 'బీటింగ్ ది రిట్రీట్ సెరమొనీ' జరుగుతున్న ప్రాంతానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. పేలుడు నేపథ్యంలో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. ఢిల్లీ నగర వ్యాప్తంగా భద్రతా బలగాలతో పాటు పోలీసులను అప్రమత్తం చేశారు. అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుంటున్నారు.  

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments