Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్‌లో బీజేపీ ఘన విజయం - హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్

Webdunia
గురువారం, 8 డిశెంబరు 2022 (12:51 IST)
గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. తద్వారా గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రధాని మోడీ నెలకొల్పిన రికార్డు ఇపుడు బద్ధలైపోయింది. గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీలో ఉన్న మొత్తం 182 సీట్లకుగాను బీజేపీ ఒక్కటే ఏకంగా 154 సీట్లలో ఆధిక్యం కొనసాగిస్తుంది. అలాగే, కాంగ్రెస్ 19, ఆప్ 6, ఇతరులు మూడుస్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. దీంతో ఆ పార్టీ అఖండ విజయాన్ని నమోదు చేయనుంది. 
 
దీంతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. గాంధీ నగర్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది. పార్టీ శ్రేణులు అపుడే సంబరాలు మొదలుపెట్టారు. పార్టీ కార్యాలయంలో డెకరేషన్ పనులు చేపట్టారు. స్వీట్లు పంచుతూ సంబరాలు జరుపుకుంటున్నారు. కాగా, గత 27 యేళ్లుగా గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఇపుడు మరోమారు అధికారంలోకి రానుంది.
 
అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్లు తమ ఆనవాయితీని మరిచిపోలేదు. ఒకసారి అధికారంలోకి వచ్చిన పార్టీకి వరుసగా మరోమారు అధికారం కట్టబెట్టే ప్రయత్నం చేయలేదు. తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ వారు అదే పని చేశారు. అధికారంలో ఉన్న బీజేపీని ఓడించి, కాంగ్రెస్ పార్టీకి మరోమారు అవకాశం కల్పించారు 
 
మొత్తం 68 సీట్లకుగాను ప్రభుత్వం ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 35. గురువారం చేపట్టి ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ 40 చోట్ల, బీజేపీ 25 చోట్ల, ఇతరులు మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని తేలిపోయింది. అయితే, ఈ ఓట్ల లెక్కింపులో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య విజయం దోబూచులాడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay Devarakonda: మన తల్లిదండ్రుల మాట వినడం ముఖ్యం.. నా కాలేజీ రోజులు వస్తున్నాయ్

Pawan Kalyan: అన్నయ్యకు యూకే అవార్డు.. సోదరుడు కాదు తండ్రి.. నా జీవితంలో రియల్ హీరో

దేవ్‌మాలిపై వ్యూ అద్భుతంగా ఉంది... కానీ ఆ ఒక్క నిమిషం నిరాశపరిచింది : రాజమౌళి

Sreeleela in 2025: గుంటూరు కారం తర్వాత బ్రేక్.. మళ్లీ కొత్త ప్రాజెక్టులతో శ్రీలీల బిజీ బిజీ

Brahmanandam: హాస్యనటుడు వృత్తి నిజంగా పవిత్రమైనది : బ్రహ్మానందం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments