Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ సోకి బీజేపీ రాజ్యసభ సభ్యుడు మృతి

Webdunia
గురువారం, 17 సెప్టెంబరు 2020 (17:19 IST)
కరోనా వైరస్ దెబ్బకు మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. నిన్నటికి నిన్న తిరుపతి ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ కన్నుమూశారు. ఈయన ప్రస్తుత లోక్‌సభలో తిరుపతి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ విషాదకర ఘటనను మరిచిపోకముందే... ఇపుడు బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు అశోక్ గస్తీ మృతి చెందారు. 
 
55 ఏళ్ల అశోక్ బెంగళూరులో కరోనాకు చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే తుదిశ్వాస విడిచారు. ఇటీవల కోవిడ్ టెస్టులు నిర్వహించడంతో కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఈ నెల 2న బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో ఈరోజు  ప్రాణాలు కోల్పోయారు.
 
అశోక్ గస్తీ తొలిసారి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. విద్యార్థి దశ నుంచి ఆయన ఆరెస్సెస్‌లో ఉన్నారు. ఆ తర్వాత 18 ఏళ్ల వయసులో బీజేపీలో చేరారు. ఆ తర్వాత  అంచెలంచెలుగా ఎదుగుతూ రాజ్యసభ సభ్యుడి వరకు ఎదిగారు. అశోక్ గస్తీ మరణం పట్ల ఆ పార్టీ నేతలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఒక మంచి నేతను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: అల్లు అర్జున్, శిరీష్, కిరణ్ అబ్బవరం దుబాయ్‌ లాండ్ అయ్యారు

ఓనమ్ పండుగ శుభాకాంక్షలతో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ స్పెషల్ పోస్టర్

విజయ్ ఆంటోనీ.. భద్రకాళి నుంచి పవర్ ఫుల్ సాంగ్ జిల్ జిల్ రిలీజ్

ఓ.. చెలియా నుంచి చిరుగాలి.. పాటను విడుదల చేసిన మంచు మనోజ్

Tran: Aries..; ట్రాన్: ఏరీస్.. డిస్నీ నుండి కొత్త పోస్టర్, ట్రైలర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments