Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారు ఎమ్మెల్యేలు కాదు.. రౌడీలు... డీఎంకే సభ్యులపై స్వామి ఫైర్

తమిళనాడు రాష్ట్రంలోని డీఎంకే ఎమ్మెల్యేలపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి తీవ్ర ఆరోపణలు చేశారు. వారు ఎమ్మెల్యేలు కారనీ, రౌడీలు అంటూ మండిపడ్డారు. వీరికంటే.. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శ

Webdunia
శనివారం, 18 ఫిబ్రవరి 2017 (13:16 IST)
తమిళనాడు రాష్ట్రంలోని డీఎంకే ఎమ్మెల్యేలపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి తీవ్ర ఆరోపణలు చేశారు. వారు ఎమ్మెల్యేలు కారనీ, రౌడీలు అంటూ మండిపడ్డారు. వీరికంటే.. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ఎంతో మేలని ఆయన వ్యాఖ్యానించారు. 
 
తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీలో శనివారం జరిగిన సంఘటనలపై ఆయన స్పందిస్తూ... ఆ పార్టీని హింసాత్మక, జాతి వ్యతిరేక పార్టీ అని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య వేదికపై గొడవ చేసిన తీరును చూస్తే డీఎంకే కంటే శశికళ ఎంతో నయమన్నారు. తమిళనాడు అసెంబ్లీలో వాలి, సుగ్రీవుల మధ్య యుద్ధం జరుగుతోందని చెప్పుకొచ్చారు.
 
డీఎంకే సభ్యులు హిందూ వ్యతిరేకులు.. దేవాలయాలు ధ్వంసం చేసే పార్టీ అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఓటింగ్‌ ప్రక్రియపై తక్షణమే గవర్నర్‌ జోక్యం చేసుకోవాలన్నారు. పళనిస్వామికి పూర్తి మెజారిటీ ఉంది, ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. డీఎంకే సభ్యులు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారంటూ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడును జాతివ్యతిరేక సభ్యుల నుంచి కాపాడాలంటూ ఆయన స్పీకర్‌‌ను కోరారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - విజయ్ దేవరకొండ

Rashmika : రష్మిక మందన్న పాన్ ఇండియా మూవీ మైసా ఫియర్స్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments