Webdunia - Bharat's app for daily news and videos

Install App

గో'మాత' కోసం చంపడానికైనా.. చావడానికైనా సిద్ధం : సాక్షి మహారాజ్

Webdunia
గురువారం, 8 అక్టోబరు 2015 (12:01 IST)
గోమాత కోసం చంపడానికైనా.. చావడానికైనా తాను సిద్ధంగా ఉన్నట్టు భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ సాక్షి మహారాజ్ ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, దాద్రీ ప్రాంతంలోని బిషాడా గ్రామంలో గోమాంసం తిన్నాడన్న నెపంతో ఓ వ్యక్తిని కొట్టి చంపిన ఘటనపై రాజకీయ నాయకుల మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతున్నది.
 
దీనిపై సాక్షి మహారాజ్ స్పందిస్తూ ఎవరైనా తమ తల్లి (గోమాత)ను చంపేందుకు ప్రయత్నిస్తే, తాము మౌనంగా చూస్తూ ఊరుకోబోమని, చంపేందుకైనా, చావడానికైనా సిద్ధమని హెచ్చరించారు. ఈ ఘటన విషయంలో యూపీ ప్రభుత్వ ద్వంద్వ విధానాలను అవలంభిస్తోందని మండిపడ్డారు.
 
మరోవైపు... బీహార్ ఎన్నికల రాజకీయాల్లో సైతం బీఫ్ ప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. భారతీయులూ పశుమాంసం తింటారని ఆర్జేడీ నేత లాలూప్రసాద్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ రామ్‌దేవ్ బాబా ఆయనను కంసునితో పోల్చారు. ఇప్పుడు లాలూ వంతు వచ్చింది. బాబా అమ్మే ఆయుర్వేద మందుల్లో పశువుల ఎముకలు కలిపినట్టు గతంలో వచ్చిన ఆరోపణలను లాలూ గుర్తు చేశారు.

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments