Webdunia - Bharat's app for daily news and videos

Install App

వందే భారత్ రైలుకు జెండా ఊపుతూ ట్రాక్‌పై పడిపోయిన బీజేపీ ఎమ్మెల్యే!! (Video)

ఠాగూర్
మంగళవారం, 17 సెప్టెంబరు 2024 (13:09 IST)
వందే భారత్ రైలుకు జెండా ఊపుతూ స్వాగతం పలుకుతున్న ఒక మహిళా ఎమ్మెల్యే ఒకరు అదుపుతప్పి ఫ్లాట్‌ఫామ్ నుంచి రైలు పట్టాలపై పడిపోయారు. అయితే, అదృష్టవశాత్తు ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఇటావా రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. 
 
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్‌గా ప్రారంభించిన వందే భారత్ రైలు ఆగ్రా నుంచి వారణాసికి వస్తున్న రైలుకు అనేక మంది బీజేపీ నేతలు ఇటావా రైల్వే స్టేషన్‌లో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి అనేక మంది బీజేపీ కార్యర్తలు స్టేషన్‌‍కు తరలివచ్చారు. దీంతో రైల్వేస్టేషన్‌తో పాటు ఫ్లాట్‌ఫామ్ కూడా కిక్కిరిసిపోయింది. ఈ క్రమంలో ఇటావా సర్దార్ ఎమ్మెల్యే సరితా భదౌరియా అదుపుతప్పి ఒక్కసారిగా కిందపడిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 
 
ఫ్లాట్‌ఫాంలోకి వస్తున్న రైలుకు స్వాగతం చెప్పేందుకు స్టేషన్‌కు స్థానికులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో రైల్వే స్టేషన్ కిక్కిరిసిపోయింది. ఒకానొక సమయంలో పరిస్థితి అదుపుతప్పేలా కనిపించింది. ఈ క్రమంలోనే తోపులాటు చోటుచేసుకోవడంతో  ఎమ్మెల్యే కిందపడిపోయారు. ఆ తర్వాత ఇతర నేతలు ఆమెను పైకి లేవనెత్తారు. పెద్దగా గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్టేషన్ కిక్కికిరిసిపోయాలా జనాన్ని అనుమతించడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

Prabhas: హోంబాలేతో ఫిలింస్ తో ప్రభాస్ మూడు చిత్రాల ఒప్పందం

సంచితా శెట్టికి మథర్‌ థెరిసా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌

NTR: బాక్సాఫీస్ విధ్వంసం చేయబోతోన్న వార్ 2 అంటూ కొత్త పోస్టర్

రవితేజకు పితృవియోగం - మెగా బ్రదర్స్ ప్రగాఢ సంతాపం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments