Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ సునామీ... 80కి 77 చోట్ల గెలుపు .. లేటెస్ట్ సర్వీ వెల్లడి

ఠాగూర్
గురువారం, 14 మార్చి 2024 (09:40 IST)
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని పూర్తిగా కాషాయమం చేయనుంది. ఈ రాష్ట్రంలో ఉన్న మొత్తం 80 లోక్‌సభ స్థానాలకు గాను ఏకంగా 77 సీట్లలో ఆ పార్టీ గెలుపొందుతుందని, ఇండియా కూటమికి కేవలం రెండు సీట్లు, బీఎస్పీకి ఒక సీటు మాత్రమే వస్తుందని న్యూస్ 18 మెగా ఒపీనియన్ పోల్ నిర్వహించిన సర్వేలో తేలింది. గత 2014లో యూపీలో బీజేపీ 72 స్థానాల్లో గెలుపొందగా, 2019లో 62 సీట్లను దక్కించుకుంది. అయితే, ఈ దఫా ఈ సీట్లు 77కు పెరుగుతాయని తెలిపారు. దీనికి కారణం అయోధ్యలో రామాలయం నిర్మాణం, ప్రారంభోత్సవమని పేర్కొంటున్నారు. 
 
న్యూస్18 మెగా ఒపీనియన్ పోల్ తాజాగా 9 రాష్ట్రాల్లోని సర్వే ఫలితాలను వెల్లడించింది. బీజేపీ దక్షిణాదిన గతంలో కంటే కాస్త పుంజుకున్నట్లుగా ఈ సర్వేలో వెల్లడైంది. బీజేపీ తమిళనాడులో 5 సీట్లు, కేరళలో 2 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని ఈ సర్వే పేర్కొంది. 543 లోక్ సభ స్థానాలకుగాను 242 స్థానాలకు సర్వే ఫలితాలను వెల్లడించింది. వీటిలో ఎన్డీయే కూటమి 174 సీట్లు, ఇండియా కూటమి 67 సీట్లు, ఇతరులు 7 సీట్లు గెలుచుకోవచ్చునని విశ్లేషించింది.
 
తొమ్మిది రాష్ట్రాల్లో ఎవరికి ఎన్ని సీట్లు రావొచ్చువంటే...?
1. బీహార్ (40) - ఎన్డీయే 38, ఇండియా 2
2. కేరళ (20) - యూడీఎఫ్ 14, ఎల్డీఎఫ్ 4, బీజేపీ 2
3. మధ్యప్రదేశ్ (29) - బీజేపీ 28, ఇండియా 1
4. తమిళనాడు (39) - ఇండియా 30, బీజేపీ 5, అన్నాడీఎంకే 4
5. హర్యానా (10) - బీజేపీ 10, ఇండియా O
6. హిమాచల్ ప్రదేశ్ (4) - బీజేపీ 4, ఇండియా 0
7. పంజాబ్ (13) - ఆప్ 1, ఇండియా 7, బీజేపీ 3, ఇతరులు 2
8. ఢిల్లీ (7) - బీజేపీ 7, ఇండియా 0
9. ఉత్తర ప్రదేశ్ (80) - బీజేపీ 77, ఇండియా 2, ఇతరులు 1

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments