Webdunia - Bharat's app for daily news and videos

Install App

గో సంరక్షణ పేరుతో హత్య.. బీజేపీ నేత అరెస్టు

గో సంరక్షణ పేరుతో హత్యలు ఏమిటని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశ్నించిన రోజే పశుమాంసం తీసుకెళుతున్నాడన్న ఆరోపణలతో ఓ వ్యక్తిని హత్య చేసిన విషయం తెల్సిందే. దీనిపై దేశ వ్యాప్తంగా విమర్శలు చెలరేగాయి. ఈ నేపథ

Webdunia
ఆదివారం, 2 జులై 2017 (13:15 IST)
గో సంరక్షణ పేరుతో హత్యలు ఏమిటని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశ్నించిన రోజే పశుమాంసం తీసుకెళుతున్నాడన్న ఆరోపణలతో ఓ వ్యక్తిని హత్య చేసిన విషయం తెల్సిందే. దీనిపై దేశ వ్యాప్తంగా విమర్శలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో.. గో సంరక్షణ పేరుతో హత్యలు చేస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించనున్నారు. 
 
గతవారంలో తన కారులో మాంసం తీసుకు వెళుతున్నాడని ఆరోపిస్తూ, ఓ వ్యక్తిపై దాడి చేసి కొట్టి చంపడమే కాకుండా, కారును దహనం చేసిన కేసులో రామ్‌గఢ్ బీజేపీ మీడియా ఇన్ చార్జ్ నిత్యానంద మహతోను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో స్థానిక పార్టీ నేత పప్పూ బెనర్జీ, మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేశామని పోలీసులు వెల్లడించారు. 
 
అలీముద్దీన్ అనే వ్యక్తిపై దాడి చేసి దారుణంగా కొట్టి, అతని మారుతి వ్యాన్‌ను దగ్ధం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. నిత్యానంద ప్రోద్బలంతోనే అల్లరిమూక రెచ్చిపోయినట్టు తమ వద్ద వీడియో సాక్ష్యం ఉందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ హత్య ముందుగా ప్లాన్ చేసుకున్నదేనని అనుమానిస్తున్నామని, నిత్యానందకు, అలీముద్దీన్‌కూ పాత గొడవలు ఉన్నాయని తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments