Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటితో నరేంద్ర మోడీ పాలనకు రెండేళ్లు : దేశ వ్యాప్తంగా బీజేపీ సంబరాలు

Webdunia
గురువారం, 26 మే 2016 (09:52 IST)
నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి గురువారా(జూన్ 26వ తేదీ)కి రెండేళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ దేశ వ్యాప్తంగా సంబరాలు నిర్వహిస్తోంది. ఈ సంబరాల్లో భాగంగా భారీ ఎత్తున ర్యాలీలు, సభలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. 
 
ఇందులోభాగంగా, శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఇందులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొని ప్రసంగించనున్నారు. దీనిపై భాజపా జాతీయ కార్యదర్శి అనిల్‌ జైన్‌ మాట్లాడుతూ కేంద్ర మంత్రులు, పార్టీ కార్యకర్తలు వివిధ ప్రాంతాల్లో మోడీ ప్రభుత్వం సాధించిన విజయాలకు సంబంధించిన వేడుకలను నిర్వహించనున్నారు. మే 27 నుంచి జూన్‌ 15 వరకు ఈ వేడుకలు జరగుతాయని చెప్పారు. 
 
వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ మోదీ రెండేళ్ల పాలన విజయోత్సవ సభను నిర్వహించేందుకు ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. గతేడాది నిర్వహించిన మొదటి విజయోత్సవ సభ మధురలో నిర్వహించారు. కాగా, ఈ యేడాది 198 నగరాల్లో 33 బృందాలు ఈ వేడుకలను నిర్వహించనున్నారు. 

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments