Webdunia - Bharat's app for daily news and videos

Install App

అశ్వానికి కాషాయం రంగు : బీజేపీపై మేనకా గాంధీ సంస్థ ఫిర్యాదు

Webdunia
శుక్రవారం, 20 ఆగస్టు 2021 (17:06 IST)
భారతీయ జనతా పార్టీ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం జన్ ఆశీర్వాద్ పేరుతో దేశ వ్యాప్త యాత్రలకు శ్రీకారం చుట్టనుంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసిన తర్వాత ఈ యాత్ర ప్రారంభంకానుంది. 
 
ముఖ్యంగా, ప్రధాని నరేంద్ర మోడీ కొత్తగా చేపట్టిన మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవులు దక్కించుకున్నవారు, ప్రమోషన్లు పొందినవారు ఈ యాత్ర ద్వారా ప్రజలతో మమేకమయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. 
 
కాగా, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో జన ఆశీర్వాద యాత్ర సందర్భంగా ఓ గుర్రానికి బీజేపీ జెండా రంగులు వేశారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా నిర్వహించిన ఈ యాత్రలో గుర్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
 
అయితే, కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీకి చెందిన పీపుల్ ఫర్ యానిమల్స్ (పీఎఫ్ఏ) స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు ఈ ఘటనను తీవ్రంగా పరిగణించారు. 
 
ఇది ఖచ్చితంగా జంతువులను హింసించడం కిందికే వస్తుందని భావిస్తూ వారు ఇండోర్‌లోని సంయోగితా గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ అంశాన్ని ఎన్నికల సంఘం దృష్టికి కూడా తీసుకెళ్లాలని వారు నిర్ణయించారు. 
 
కాగా, గతంలో మేనకా గాంధీ ప్రధాని మోడీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం-1 మంత్రివర్గంలో కేంద్ర మంత్రిగా పని చేసిన విషయం తెల్సిందే. ఆమె కుమారుడు వరుణ్ గాంధీ బీజేపీలో కొనసాగుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments